Home » Author » M N
Tamil Nadu: ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి మంటలు చెలరేగి ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. తమిళనాడులోని కాంచీపురంలో ఈ ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ బాణసంచా పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఈ ఫ్యాక్టరీలో పని చేస్తున్న 8 మంది కార్మికులు సజీవ దహనమైనట్లు తెలుస్తుంది. పలువురు కార్మికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. కురువిమలై వరాలతోట్ ప్రాంతంలో ‘నరేంద్రన్ ఫైర్ వర్క్స్’ […]
Janasena-BJP: ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు పొత్తులో ఉన్నాయా అంటే అవుననే అంటున్నాయి ఆ రెండు పార్టీలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మావాడేనని.. జనసేన ఒక్కటే మాకు పొత్తు పార్టీ అని చెప్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో పొత్తులో ఉన్నామని.. ఎన్నికల సమాయానికి ఎవరు కలిసి వచ్చినా కలిసి పోతామని కూడా చెప్తున్నారు. బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నా ఆ పార్టీలు కలిసి చేసిన పోరాటాలు కనిపించవు.. కలిసి […]
Visakhapatnam: తెలుగు రాష్ట్రాలలో రోడ్లు నిత్యం రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. కారణం డ్రైవర్ల మద్యం మత్తు, నిర్లక్ష్యం. ఇవి రెండూ ఒక్కోసారి ఘోర ప్రమాదాలకు కూడా దారితీస్తున్నాయి. కాగా, పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి ట్యాంకర్ లారీల డ్రైవర్లైతే మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు ఊహించని స్థాయిలో ఉంటాయి. కొన్ని నెలల క్రితం పాకిస్థాన్ లో అతివేగంగా వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ బోల్తా కొట్టి జరిగిన పేలుడులో దాదాపు 100 మంది మృతి చెందిన ఘోర ప్రమాదమే […]
Rain Alert to Telugu States: వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో హెచ్చరిక జారీచేసింది. మరో రెండు రోజుల పాటు పలు ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో శుక్రవారం, శనివారం రెండురోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. విస్తారంగా వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం తమిళనాడు నుంచి ఉన్న ద్రోణి మంగళవారం నాటికి దక్షిణ శ్రీలంక […]
Teenmaar Mallanna: ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో గత రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు అనంతరం ఆయనతో పాటు తెలంగాణ విఠల్ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకోవడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండించింది. అరెస్ట్ చేసిన వారిని వెంటనే వదిలిపెట్టాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు తెలంగాణ బీజేపీ […]
AP Govt: ఏపీ ప్రభుత్వం సలహాదారుల నియామకంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం 45 మంది సలహాదారులున్నట్లు అంచనా కాగా వీరందరికీ విలాసవంతమైన వాహనం, బంగ్లా, వ్యక్తిగత సిబ్బంది, ఇతర విలాసవంతమైన సౌకర్యాలు కూడా ఇస్తున్నారు. అందులో 8 మంది సలహాదారులకు కేబినెట్ హోదా కూడా కల్పించారు. మరో 12 మంది సలహాదారులకు అధికారిక నివాసం, డ్రైవర్, పిఎ, పిఎస్, కార్యాలయంతో పాటు కేటగిరీ-1 పే-స్కేల్ (నెలకు రూ. […]
Hyderabad: ఓ పోలీస్ వ్యాన్ జైలు వైపు వెళ్తుంది. హోమ్ గార్డ్ ఆ వ్యాన్ కు డ్రైవర్ గా ఉన్నాడు. మొత్తం 16 మంది కార్యకర్తలను వ్యాన్ లో జైలుకు తరలిస్తున్నారు. వారికి రక్షణగా పోలీస్ సిబ్బందితో పాటు ఎస్సై కూడా వ్యాన్ లో ఉన్నారు. వ్యాన్ రోడ్ మీద వెళ్తుండగా డ్రైవర్ కు ఫిట్స్ వచ్చి స్టీరింగ్ మీద పడిపోయాడు. వ్యాన్ రోడ్ మీద అలాగే మెలికలు తిరుగుతూ వెళ్తూనే ఉంది. గమనించిన ఎస్సై వ్యాన్ […]
Earthquake: పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాలలో భారీ భూకంపం సంభవించింది. వెంట వెంటనే రెండు దేశాలలో భారీ భూకంపం సంభవించచడంతో స్థానిక ప్రజలు హడలెత్తిపోయారు. రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రతగా నమోదైనట్లు సిస్మోలజీ అధికారులు పేర్కొన్నారు. ఈ భూకంపం ధాటికి పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. భూకంపం సంభవించడంతో ప్రజలు ఇళ్ల నుండి పరుగులు తీశారు. కాగా, ఫైజాబాద్కు 133 కిమీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ గుర్తించింది. ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం సంభవించిన […]
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై దాఖలైన పిటిషన్ల మీద హైకోర్టు విచారణ చేసింది. అనంతరం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని.. ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీల కేసుపై హైకోర్టులో వాదనలు జరిగాయి. కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ దాఖలు చేసిన […]
Nara Devaansh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బ్రాహ్మణిల ముద్దుల తనయుడు నారా దేవాన్ష్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా లోకేశ్, బ్రాహ్మణి తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ప్రకటించారు. దేవాన్ష్ ప్రతి పుట్టినరోజుకీ తిరుమల కొండపై ఒకరోజు అన్న ప్రసాద వితరణ కోసం లోకేశ్ కుటుంబం భారీ విరాళం ప్రకటించడం ఆనవాయతీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా రూ.33 లక్షలను టీటీడీ అధికారులకు విరాళంగా అందజేశారు. తిరుమలలో […]