Maharshi Pathanjali: వ్యాకరణ శాస్త్రానికి భాష్యం రచించిన పతంజలి మహర్షి గొప్పతనం తెలుసా…?

పతంజలి మహర్షి ఒక యోగశాస్త్ర రచయితగా మనందరికీ సుపరిచితం. కానీ, ఆయన గురించి తెలుసుకోవలసిన విజ్ఞాన విశేషాలు మరెన్నో ఉన్నాయి. మొట్టమొదటగా వ్యాకరణం రాసిన మేధావి పాణిని. ఆయన రాసిన వ్యాకరణ శాస్త్రానికి పతంజలి భాష్యం రాశాడు. అది ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. దీంతో విదేశాల నుంచి కూడా ఎందరో శిష్యులు వ్యాకరణ భాష్యం నేర్చుకోవడానికి పతంజలి దగ్గరికి రాసాగారు.
మంచి విద్య అందరికీ చెందాలి. ప్రపంచమంతా వ్యాప్తి చెందాలనే ఆశయంతో వారిని శిష్యులుగా స్వీకరించాడు పతంజలి. మొత్తంగా వెయ్యి మంది ఆయన దగ్గర శిష్యులుగా చేరారు. వారిలో చెప్పుకోదగిన శిష్యుడు గౌడపాదుడు. ఇప్పుడు ఏ బృంద కార్యక్రమాలు జరిగినా అందరికీ వినిపించేలా ‘మైక్ సెట్” అనే సాధనాన్ని వాడటం మనం చూస్తున్నాం! అలాంటి యంత్రాన్నే పతంజలి కనుగొన్నాడు. పతంజలి పాఠశాలలో లేని సమయంలోనూ ఆ యంత్ర సాయంతో శిష్యులు పాఠాలు వల్లించేవారు అంటే.. ఆ యంత్రం కేవలం మైక్సెట్ మాత్రమే కాదనీ, టేప్రికార్డర్ వంటి సాధనమై ఉంటుందని ఊహించవచ్చు.
పతంజలి అని పిలువబడే వైద్య గ్రంథం రచయిత పతంజలి. దీనిని పతంజలి లేదా పతంజలతంత్రా అని కూడా పిలుస్తారు. ఈ వచనం అనేక యోగ, ఆరోగ్య సంబంధిత భారతీయ గ్రంథాలలో ఉటంకించబడింది. పతంజలిని అనేక సంస్కృత గ్రంథాలలో యోగరత్నకర, యోగరత్నాసముక్కాయ, పదార్థవిజ్ఞాన, చక్రదత్త భాష్య అని పిలుస్తారు. పతంజలి చేసిన ఈ ఉల్లేఖనాలలో కొన్ని ప్రత్యేకమైనవి. కాని మరికొన్ని చరక సంహిత, సుశ్రుత సంహిత వంటి ప్రధాన హిందూ వైద్య గ్రంథాలలో కూడా కనిపిస్తాయి