Rajanna Sirisilla: అరుదైన కాన్పు.. ఒకే కాన్పులో పుట్టిన నలుగురు పిల్లలు!

Rajanna Sirisilla: సాధారణంగా ఒక్క కాన్పులో ఒక్కరి జన్మిస్తారు. ఒక్కోసారి కవలలకు జన్మిస్తారు. రేర్ కేసుల్లో ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిస్తారు. కానీ ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వైద్యులు అరుదైన శస్త్రి చికిత్స నిర్వహించి శిశువులను బయటకు తీశారు. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కాన్పు కోసం చేరిన ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్టుముక్కల లావణ్య కాన్పు కోసం ముస్తాబాద్ పీపుల్స్ ఆస్పత్రిలో చేరారు. ఇది ఆమెకు రెండో కాన్పు. మొదటి కాన్పులో బాబు.. అతనికి 9 ఏళ్లు, రెండో కాన్పులో తొలుత బాబు, తరువాత పాప, అనంతరం మరో ఇద్దరు బాబులు జన్మించారు. వీరికి మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట చిల్డ్రన్ ఆసుపత్రికి తరలించారు.
లావణ్య డెలవరీ కోసం వచ్చిన ఆస్పత్రికే ఆమె నెలనెలా చెకప్ కు వెళ్లేవారు. కడుపులో నలుగురు శిశువులు ఉన్నారని వైద్యులకు తెలుసు.. ఎందుకంటే మూడు నెలలకి ఒకసారి చేసే టిఫా స్కానింగ్ తో పాటు నెలా నెలా చేసే స్కానింగ్ లో వైద్యులకు ఈ విషయం తెలిసిపోతుంది. మరో ఈ విషయం లావణ్యకి చెప్పారో లేదో తెలియదు కానీ.. ఇప్పుడైతే దీంతో చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేసి శిశువులను బయటకు తీశారు. లావణ్యకు మొదట బాబు జన్మించగా.. తర్వాత పాప, బాబు, బాబు పుట్టారని వైద్యులు చెప్పారు. గతంలో ఆఫ్రికాలోని ఓ దేశానికి చెందిన మహిళ ఒకే కాన్పులో తొమ్మిది మందికి జన్మనిచ్చింది. ఆ మహిళ గిన్నిస్ రికార్డులకెక్కి సెలబ్రిటీగా మారిపోయింది.