Kahramanmaras earthquake: 1600 మందికి పైగా మృతి.. శవాల దిబ్బగా మారిన అందమైన నగరం!

Kaburulu

Kaburulu Desk

February 6, 2023 | 05:11 PM

Kahramanmaras earthquake: 1600 మందికి పైగా మృతి.. శవాల దిబ్బగా మారిన అందమైన నగరం!

Kahramanmaras earthquake: టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో టర్కీ, సిరియాలో భూకంపం అతలాకుతలం చేసింది. భూకంపం కారణంగా చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. పెద్దసంఖ్యలో మరణాలు సంభవించాయి. మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 1600 మందికి పైగా దుర్మరణం చెందారు.

సోమవారం తెల్లవారుజామున ప్రజల జీవనం రోజూలానే మొదలు కాగా ఒక్కసారిగా భూప్రకంపనలతో బెంబేలెత్తిపోయారు. భూకంపం సృష్టించిన కల్లోలానికి వందల మంది చనిపోగా, వేల మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికే తీవ్రమైన చలికి అల్లాడిపోతున్న టర్కీ ప్రజలు భూకంపం దెబ్బకు సర్వం కోల్పోయారు. కళ్ల ముందు నివాసాలు కూలిపోతుంటే నిట్టూర్చుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నిల్చున్న పరిస్థితి టర్కీ, సిరియా ప్రజలది.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ సహాయ కార్యక్రమాలు కొనసాగుతుండగానే టర్కీలో మరోసారి భూకంపం వచ్చింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 7.5గా నమోదైనది. దీంతో మృతుల సంఖ్య మరింత భారీగా పెరగనుంది. టర్కీ, సిరియాలో పెను భూకంపంతో ఇటలీలో కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంతాల్లో భారీ అలలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వాలు తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

https://twitter.com/Brinda_IND/status/1622490837388242945?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1622490837388242945%7Ctwgr%5Ea08a5f83f367ace2a4febdda096a258eb4f48125%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.oneindia.com%2Fnews%2Finternational%2Fover-1600-dead-after-strong-7-8-magnitude-quake-hits-turkey-and-syria-tsunami-alert-in-italy-336571.html

టర్కీలో ఈ స్థాయిలో భూకంపం విరుచుకుపడటానికి కారణం లేకపోలేదు. ప్రపంచంలోనే భూకంపం సంభవించేందుకు ఎక్కువ అవకాశమున్న ప్రాంతం టర్కీ. ఈ దేశంలోని ఎక్కువ ప్రాంతం అనటోలియన్ టెక్టోనిక్ ప్లేట్(Anatolian Tectonic Plate)పై విస్తరించి ఉంది. ఈ కారణంగా టర్కీ ప్రజలను భూకంప భయం ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. ఆ ప్లేట్ లో మార్పులు జరిగిన ప్రతిసారి భూకంపాలు సంభవించడం.. వేలు, వందలలో ప్రాణం నష్టం జరుగుతుంది. దాని నుండి ఇక్కడ ప్రజలు కోలుకోనేలోపు మరోసారి భూకంపలు వస్తున్నాయి.