Swami Ramdev: ముస్లింల, క్రిస్టియన్లపై బాబా రామ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు

Swami Ramdev: యోగా గురువు బాబా రాందేవ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హిందూ మహిళల్ని అపహరిస్తున్నారంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. జైపూర్లోని బర్మెర్లో జరిగిన సాధువుల సమావేశంతో పాటు తాజాగా రాజస్థాన్ లోని బార్మర్ లో జరిగిన పీఠాధిపతుల సమావేశంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. ముస్లింలు విద్వేష వ్యాప్తి చేస్తున్నారని చెప్తూనే హిందూయిజాన్ని ఇస్లాం, క్రైస్తవంతో పోలుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మంచి చేయమని హిందూ మతం చెబుతుందని, అయితే రెండు మతాలు (ఇస్లాం, క్రైస్తవం) మతమార్పిడికి పాల్పడుతుంటాయంటూ రాందేవ్ బాబా ఆరోపించారు. ఆయన ప్రసంగానికి చెందిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ వీడియోలో చూస్తే.. ముస్లిం సమాజం ఉగ్రవాదాన్ని ఆశ్రయించిందని, హిందూ మహిళలను అపహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ముస్లింలు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తారు. నమాజ్ తర్వాత వాళ్లేం చేయాలనుకుంటున్నారో అది చేస్తారు. హిందూ అమ్మాయిలను ముస్లింలు కిడ్నాప్ చేస్తారు. వాళ్లు అన్నిరకాల పాపాలకు పాల్పడతారు. మన ముస్లిం సోదరులు అనేక పాపాలు చేసినా నమాజ్ మాత్రం తప్పనిసరిగా చేస్తారు. అలా చేయమని వాళ్లకు వాళ్ల మత గురువులు, కుటుంబీకులు నేర్పుతారు. కానీ హిందూ మతం అలాంటిది కాదు. కేవలం మంచి చేయమని మాత్రమే చెప్తుందని అన్నారు.
కాగా, యోగా గురు బాబా రామ్దేవ్ పై కేసు నమోదు అయింది. రామ్దేవ్ బాబా ముస్లింలపై ద్వేషపూరిత ప్రసంగానికి పాల్పడ్డారని.. స్థానికంగా ఉండే పథాయ్ ఖాన్ చౌహతాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 153ఏ (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాస స్థలం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం ), 295ఏ (మతపరమైన భావాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యం, హానికరమైన చర్యలు), 298ఏ(మతపరమైన భావాలను దెబ్బతీయాలని, ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం) వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరి ఈ వివాదం ఎలా మారుతుందో చూడాల్సి ఉంది.