Death of an elephant: దారుణం.. పొలాల్లోకి వెళ్తున్న ఏనుగు.. విద్యుత్ షాక్ తగిలి మృతి

Kaburulu

Kaburulu Desk

March 19, 2023 | 06:00 PM

Death of an elephant: దారుణం.. పొలాల్లోకి వెళ్తున్న ఏనుగు.. విద్యుత్ షాక్ తగిలి మృతి

Death of an elephant: పొలాల్లోకి వెళ్తున్న ఏనుగు అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి సంఘటన స్ధలంలోనే కుప్ప కూలింది. అక్కడిక్కడే మరణించింది. ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన చిత్తూరు జిల్లా ధర్మపురిలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పంట పొలాల్లో వెళ్తున్న ఏనుగుకు విద్యుత్ వైర్లు తగిలడంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ వీడియోను అక్కడున్నవాళ్లు షూట్ చేయడంతో ఇప్పుడది వైరల్‌గా మారింది.

అయితే, వేటగాళ్లు ఏనుగుల కోసం విద్యుత్ తీగలను ఏర్పాటు చేశారా, లేక పొరపాటున విద్యుత్ తీగలు తెగి ఏనుగు మృతి చెందిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే తరహలో ఏనుగులు మృతి చెందిన ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో కూడా పొలం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి మూడు ఏనుగులు మృతి చెందాయి. ఈ ఘటన ఈ నెల ఏడో తేదీన ధర్మపురి జిల్లా కొట్టాయ్ గ్రామంలో జరిగింది. విద్యుత్ తీగలు తగిలి మూడు ఏనుగులు మృతి చెందాయి.

ఏపీలోని చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగులు తరచూ గ్రామాల్లోకి వస్తున్నాయి. అటవీ ప్రాంతాల నుండి ఏనుగులు ఆహారం కోసం గ్రామాల వైపునకు వస్తున్నట్టుగా అటవీశాఖాధికారులు చెబుతున్నారు. గ్రామాలకు దూరంగా ఉన్న పొలాల వద్ద అడవి జంతువుల బారిన నుండి పంట పొలాలను కాపాడేందుకు రైతులు కంచెలు ఏర్పాటు చేసి విద్యుత్ తీగలను ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు అడవి జంతువులను వేటాడేందుకు కంచెలకు విద్యుత్ షాక్ ఏర్పాటు చేస్తున్నారని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.