3rd day Samantha kumbh 2023 brahmotsavam: మూడోరోజు సమతా కుంభ్ మహోత్సవాలు ఏ విధంగా జరిగాయో తెలుసుకున్నారా…?
ప్రసిద్ధ దైవ క్షేత్రమైన ముచ్చింతల్ పరిసర ప్రాంతాలన్నీ రామానుజుల వారి నామస్మరణతో మారుమ్రోగిపోతుంది. సమతా కుంభ్ మహోత్సవాలు ప్రారంభమై ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయింది. మరి మూడో రోజు విశేషాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం. 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవను ఈరోజు ఉదయం 11 గంటలకు తిరుమంజన సేవ నిర్వహించారు. నిన్న గరుడ సేవ నిర్వహించిన 18 దివ్యదేశాల ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు. స్వామివారికి నిన్నటి యాత్ర శ్రమ తీరడం కోసం తిరుమంజనం కార్యక్రమం చేస్తున్నారని శ్రీ చినజీయర్ స్వామి తెలిపారు.