Kondagattu Jathara: ప్రసిద్ధ హనుమంతుడి క్షేత్రం కొండగట్టుకు రూ.100 కోట్లు మంజూరు…! విశేషాలేమిటో తెలుసా..?

శ్రీ రాముడి వనవాసం తర్వాత జరిగిన రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినపుడు సంజీవనిని తెచ్చేందుకు హనుమంతుడు బయలుదేరుతాడు. అతడు సంజీవనిని తెచ్చేటపుడు ముత్యంపేట అనే ప్రదేశంలో కొంతభాగము విరిగిపడుతుంది. ఆ భాగమునే కొండగట్టు పర్వతభాగముగా పిలుస్తున్నారు. మరి ఇంతటి చారిత్రక, పురాణ కథ ఉన్న ఈ ప్రదేశం యొక్క విశిష్టత ఏమిటో… అభివృద్ధి పనులు ఏమిటో ఇపుడు తెలుసుకుందాం…!
కొండగట్టు ఆలయ అభివృద్ధికి వందకోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవ సభలో ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు మంజూరు చేస్తామని బహిరంగ సభలో కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ దేవాయలయంతో పాటు కొండగట్టు దగ్గర కొండల రాయుని స్థావరం, మునుల గుహ, సీతమ్మ కన్నీటి ప్రదేశం, తిమ్మయ్యపల్లె శివారులోని బోజ్జ పోతన గుహలు, అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్లదారి, భేతాళుడి ఆలయం, పులిగడ్డ బావి, కొండలరాయుని గట్టు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీవేంకటేశ్వర ఆలయం, అమ్మ వారు, శ్రీరామ పాదుకలు, అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాళ్లు, హరిత వర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు కనువిందు చేస్తాయి.