Paragliding Gone Wrong: పారాగ్లైడింగ్కు వెళ్లిన పారాచూట్ ఫెయిల్.. స్తంభంపై చిక్కుకున్న జంట!

Paragliding Gone Wrong: మేఘాలను తాకేలా పారాగ్లైడింగ్ చేయడం అంటే కొంతమందికి అదొక సరదా. పక్షిలా గాల్లో ఎగురుతూ భూమిని చూస్తూ తమని తాము మర్చిపోతుంటారు. అయితే, ఇలాంటి అడ్వెంచర్స్ చేసేప్పుడు ఏ మాత్రం పట్టుతప్పినా ప్రాణాలు కూడా గాల్లోనే కలిసిపోతాయి. అప్పుడప్పుడు పారాగ్లైడింగ్ ఫెయిల్ అయి ఎక్కడెక్కడో బిల్డింగులు మీద స్పైడర్ మ్యాన్ లాగా ఇరుక్కుపోతుంటారు. కేరళలో కూడా తాజాగా అలాగే జరిగింది.
కేరళ బీచ్ వెకేషన్కు వెళ్లిన ఓ జంట పారాగ్లైడింగ్ అడ్వెంచర్ చేశారు. అయితే, గాల్లో అది ఫెయిల్ కావడంతో ప్రమాదంలో చిక్కుకుని తృటిలో తప్పించుకుంది. తిరువనంతపురం గ్రామీణ ప్రాంతంలోని వర్కాలలోని పాపనాశం బీచ్లో ఓ జంట థ్రిల్లింగ్ కోసం పారాగ్లైడింగ్కు వెళ్ళింది. అయితే, పారాచూట్ అనుకున్న చోట్ ల్యాండ్ కాలేదు. చివరికి పారాచూట్ ఓ హై వోల్టేజ్ విద్యుత్ స్థంభానికి చిక్కుకుంది.
దీంతో పారాగ్లైడింగ్ చేసిన ఆ జంట పోల్ నుంచి కిందకు దిగేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఒకపక్క విద్యుత్ స్థంభం టెన్షన్, మరోవైపు కిందకి ఎలా దిగాలో అర్ధం కాని టెన్షన్ కలిసి ఆ జంట కిందకి దిగే వరకు ఉత్కంఠగా మారింది. వీరిద్దరూ కింద పడకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దాదాపు రెండు గంటల పాటు స్తంభానికి వేలాడుతూనే ఉన్నారు. వీరిని రెస్క్యూ చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది.
అయితే, అగ్నిమాపక సిబ్బంది దగ్గర కూడా స్తంభాన్ని ఎక్కేంత ఎత్తు గల నిచ్చెన లేకపోవడంతో ముందు జాగ్రత్త చర్యగా పరుపులు, వలలను ఏర్పాటు చేసి.. ఎట్టకేలకు సిబ్బంది వీరిద్దరిని సురక్షితంగా కిందకు దించింది. ప్రస్తుతం వారిద్దరూ వర్కాలలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దురదృష్టకరమైన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Watch: Paragliding Gone Wrong, Two People Stuck On An Electric Pole In Kerala https://t.co/gU149qYIFq pic.twitter.com/knWihdQC1y
— NDTV (@ndtv) March 7, 2023