US school attack: పాఠశాలలో మహిళ విచక్షణారహితంగా కాల్పులు.. ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు మృతి!

Kaburulu

Kaburulu Desk

March 28, 2023 | 01:05 PM

US school attack: పాఠశాలలో మహిళ విచక్షణారహితంగా కాల్పులు.. ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు మృతి!

US school attack: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. టెన్నెస్సీలోని నాష్‌విల్లేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఒక మహిళ కాల్పులు జరపడంతో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలో నిందితుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రీ-స్కూల్ నుండి ఆరవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం ప్రైవేట్ క్రిస్టియన్ పాఠశాల అయిన నాష్‌విల్లేలోని పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తొమ్మిదేళ్ల వయసున్న ముగ్గురు పిల్లలకు తుపాకీ గాయాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వాండర్‌బిల్ట్‌లోని మన్రో కారెల్ జూనియర్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు చేరుకున్న తర్వాత వారు చనిపోయినట్లు ప్రకటించారు. మిగత బాధితులందరూ 60 ఏళ్లు పైబడిన వారేనని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి పేరు ఆడ్రే హలే(28) అని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి లింగమార్పి డి చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. దాంతో పోలీసులు హలేని ‘ఆమె’ అని సం బోధిస్తుండగా.. లింక్డిన్ ప్రొఫైల్ మాత్రం పురుషుడిగా సూచిస్తోంది.

ఇది ఆకస్మికంగా జరిగిన షూటింగ్ కాదని పోలీసులు వెల్లడించారు. భారీస్థాయిలో కాల్పులకు ప్రణాళిక రచించినట్లు ఆ వ్యక్తి వద్ద లభించిన మెనిఫెస్టో, మ్యాప్ను బట్టి తెలుస్తోందన్నారు. తన ప్రణాళికలో పాఠశాల ఒకటని, ఇంకా పలు ప్రాంతాల్లో కాల్పులు జరపాలనుకున్నట్లు
చెప్పారు. ఒకపక్కగా ఉన్న ప్రవేశ ద్వారం నుంచి పాఠశాలలోకి ప్రవేశించి, కాల్పులు జరుపుతూ భవనంలోకి వెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటనలో తొమ్మి దేళ్లలోపు ముగ్గురు చిన్నారులు మరణించగా.. మృతుల్లో మరో ముగ్గురు 60 ఏళ్ల వయస్సు వారు.

ఈ మృతుల్లో ఒకరు పాఠశాల హెడ్ కాగా.. మిగతా వారు సిబ్బంది.. స్కూల్ విద్యార్థులు. ఇక పోలీసుల కాల్పుల్లో నిందితురాలు హలే మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటన వెనక గల కారణాలపై పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తికి ఎటువంటి నేర చరిత్రలేకపోవడం, ఉన్నత విద్యా ర్హతలుండటం గమనార్హం. ఈ హింసాకాండను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందన్నా రు.