Love couple suicide: ఇద్దరిదీ ఒకే ఊరు.. ఒకే కాలేజీ.. ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని యువజంట ఆత్మహత్య!

Kaburulu

Kaburulu Desk

March 29, 2023 | 11:19 PM

Love couple suicide: ఇద్దరిదీ ఒకే ఊరు.. ఒకే కాలేజీ.. ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని యువజంట ఆత్మహత్య!

Love couple suicide: వారిద్దరిదీ ఒకే ఊరు.. ఒకే కాలేజీ. అది చాలదా ప్రేమ చిగురించేందుకు. అన్ని ప్రేమ కథలలాగానే ఆ ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ ప్రేమకి నెలల నుండి ఏళ్ళు వయసుకొచ్చే కొద్దీ వారిద్దరూ జీవితాతం కలిసే బ్రతకాలని నిర్ణయించుకున్నారు. ఈ లోగానే ఊళ్ళో వాళ్ళతో పాటు ఇరు కుటుంబాలకు విషయం తెలిసింది. మందలించారు. అయితే.. తమ ప్రేమ గురించి ఇటు కుటుంబాలలో చెప్పిన ఆ జంట వారిని ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ, వాళ్ళు ఒప్పుకోకపోవడంతో రైలు పట్టాలపై మృతదేహాలయ్యారు.

ఏపీలోని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సెలపాడు గ్రామంలో ఉయ్యూరు శ్రీకాంత్, పులి త్రివేణి అనే యువతీ, యువకులు ఉన్నారు. ఇద్దరూ తెనాలిలో డిగ్రీ చదువుకున్నారు. శ్రీకాంత్, త్రివేణిది ఒకే ఊరు కావడంతో ఇద్దరికీ కాస్త పరిచయం ఉండేది. ఆ పరిచయంతోనే ఇద్దరూ ఇంకాస్త దగ్గరై ప్రేమలో పడ్డారు. ఎలాగైనా పెద్దలను ఒప్పించి ఘనంగా వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అలా వీరి ప్రేమాయణం గత కొన్నేళ్ల పాటు కొనసాగుతూ వచ్చింది.

అయితే, వీరి ప్రేమ వ్యవహారం ఇటీవల ఇళ్లలో తెలిసి వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రేమికులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. గత రెండు రోజుల క్రితం కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన త్రివేణి.. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు అంతటా వెతికి ఏం చేయాలో అర్థం కాక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానిక ప్రాంతాల్లో గాలించగా.. బుధవారం సుద్దపల్లి రైల్వే గేట్ పై ఓ యువతి, యువకుడి మృతదేహాలు కనిపించాయి.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వెంటనే త్రివేణి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. యువతి తల్లిదండ్రులు సుద్దపల్లి రైల్వే ట్రాక్ పై పడి ఉన్నత్రివేణి మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు సైతం అక్కడికి చేరుకుని కుమారుడిని అలా చూసి కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.