Killer Wife: భర్త, అత్తలను ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన ఇల్లాలు.. ఇంత ఘోరమా!

Kaburulu

Kaburulu Desk

February 21, 2023 | 03:09 PM

Killer Wife: భర్త, అత్తలను ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన ఇల్లాలు.. ఇంత ఘోరమా!

Killer Wife: మనుషులలో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. ఈ మధ్య కాలంలో దేశంలో దిగ్బ్రాంతికి గురి చేసే హత్యోదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో నిక్కీ యాదవ్‌ అనే యువతిని సాహిల్‌ గహ్లోత్‌ అనే యువకుడు చంపేసి దాబాలోని ఫ్రిజ్‌లో దాచిపెట్టిన ఘటన చూసే ఉంటారు. అదే ఢిల్లీలో సహజీవన భాగస్వామి శ్రద్ధావాకర్ ప్రాణం తీసి ముక్కలు చేసి చెల్లాచెదురుగా పడేసిన ఆఫ్తాబ్ పూనవాలా ఘటన కూడా మరిచిపోనేలేదు. ఈలోగా అంతకి మించి కిరాతంగా మర్డర్ మరొకటి వెలుగులోకి వచ్చింది.

ఇది అస్సాంలో వెలుగుచూసింది. గువాహటి సమీపంలోని నున్‌మతిలో ఓ యువతి భర్త, అత్తను దారుణంగా చంపేసింది. వారి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి.. ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి కొండల్లో విసిరేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనం రేపింది. నున్‌మతిలో వందన కలీట అనే యువతి భర్త అమరేంద్ర డే, అత్త శంకరి డేలతో నివాసం ఉంటోంది. ఐతే ధంజిత్ దేకా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని చేయరని ఘోరం చేసింది.

ఏడు నెలల కిందట ప్రియుడు ధంజిత్ దేకా.. మరో స్నేహితుడు అరూప్ దాస్‌తో కలిసి భర్త అమరేంద్ర దే, అత్త శంకరి దేని కలీట హత్య చేసింది. చంపేసిన తర్వాత వారి శరీర భాగాలను ముక్కలుగా కోసి పాలిథీన్ కవర్లలో ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో పెట్టింది. మూడు రోజుల తర్వాత వాటిని గౌహతికి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో మేఘాలయాలోని చిరపుంజికి తన ప్రియుడితో కలిసి వెళ్లి అక్కడి కొండల్లో విసిరేసింది.

అక్కడ నుండి తిరిగి వచ్చిన తర్వాత 2022 సెప్టెంబర్ లో తన భర్త, అత్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త అమరేంద్ర దే కజిన్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానించడం మొదలు పెట్టారు. విచారణలో పోలీసులకు వందన ప్రవర్తన పట్ల సందేహాలు వ్యక్తమయ్యాయి. అదే కోణంలో దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తల్లీకొడుకులను తానే హత్య చేసినట్లు వందన ఒప్పుకోగా.. వందన, ప్రియుడితో కలిసి పోలీసులు భర్త, అత్త శరీర భాగాలను పడేసిన చోటుకు వెళ్లి రికవరీ చేశారు.