vattem: వట్టెంలో ప్రారంభమైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు… కలశాభిషేకంలో జూపల్లి రమేశ్వరరావు దంపతులు!

Kaburulu

Kaburulu Desk

March 5, 2023 | 03:49 PM

vattem: వట్టెంలో ప్రారంభమైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు… కలశాభిషేకంలో జూపల్లి రమేశ్వరరావు దంపతులు!

తెలంగాణ రాష్ట్ర తిరుపతిగా పేరుగాంచిన వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తృతీయ పుష్కర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, వట్టెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తృతీయ పుష్కర బ్రహ్మోత్సవములు కన్నుల పండగలా నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ప్రాతఃకాలారాధన, అర్చన, సేవా కాలము, నివేదన, శాంతి పాఠం, తీర్థ ప్రసాద గోష్టి వైభవంగా జరుతున్నాయి. చతుస్థానార్చన, మూల మంత్ర హోమములు, శ్రీ సుదర్శన ఇష్టి కూడా నిర్వహిస్తున్నారు.

ఈ గ్రామానికి ఆగ్నేయంగా మరో గట్టు ఉంది. అది గుద్లనర్వ, వట్టెం గ్రామాల నడుమ అడ్డంగా ఉంది, కాబట్టి అడ్డ గట్టు అంటారు. దానిపై ఒక సొరికలో పురాతనమైన లింగ ప్రతిష్ఠ ఉంది. ఆ దేవుని పేర పూర్వం గుట్ట కింద లింగాపురం ఉంది. దాని క్షేత్ర పాలకుడుగా వేంకటేశ్వరుడు ఆ గుట్ట పై ఉన్నాడు. అందుచే దానికి క్షేత్ర పాలకుని గుట్ట అని కూడా అంటారు.లింగాపురం అనంతర కాలంలో ‘వట్టెం’ గ్రామంగా మారింది.

1986-87 ఏడాదిలో ఆలయ ఏర్పాటు సమయంలో ఇది కరువుజిల్లాగా ఉండేదని శ్రీ చిన్న జీయర్ స్వామి చెప్పారు. ఇక్కడ ఉన్న వేలాది ఎకరాలు భూమి సాగులోకి రావాలని ఆ దేవున్ని కోరుకున్నామన్నారు. దేవుడి అనుగ్రహం వల్లే ఇప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధిలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన వెంకట్రాద్రి రిజర్వాయర్ ప్రాజెక్టుతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతోందన్నారు శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి అన్నారు. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి అనుగ్రహం అందరికీ ఉంటాయని స్వామిజీ తెలిపారు.