Medak: రూ.40 లక్షలతో పాఠశాల అభివృద్ధి.. అనుమతి ఎవరిచ్చారని హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు!

Kaburulu

Kaburulu Desk

March 24, 2023 | 06:50 PM

Medak: రూ.40 లక్షలతో పాఠశాల అభివృద్ధి.. అనుమతి ఎవరిచ్చారని హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు!

Medak: అధ్వాన్నంగా తయారైన ఏండ్ల నాటి స్కూల్ బిల్డింగ్ కింద టీచర్లు, స్టూడెంట్స్ బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. రోజు రోజుకీ బిల్డింగ్ పరిస్థితి దారుణంగా తయారవడంతో టీచర్లు, హెడ్ మాస్టర్ కలిసి మొరపెట్టుకుంటే.. ఓ రాజకీయ నేత కుమారుడు స్పందించి, తన స్వచ్ఛంద సంస్థ నిధులు రూ.40 కోట్లు కేటాయించి స్కూల్ బాగుచేయించాడు. పాడుబడిన ఆ స్కూల్ ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలను తలపిస్తుంది కానీ.. ఇంత చేసిన స్కూల్ హెడ్ మాస్టర్ కు మాత్రం షోకాజ్ నోటీసులు దక్కాయి.

మెదక్ జిల్లాలోని ఓ గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్‌ శిథిలావస్థకు చేరుకుంది. స్కూల్ బిల్డింగ్ అధ్వాన్నంగా తయారైందని స్టూడెంట్స్, ఉపాధ్యాయులు మొరపెడితే.. హైదరాబాద్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ తక్షణమే స్పందించే తన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తో ఆ స్కూల్ ని బాగు చేయించారు. దాదాపు రూ.40 కోట్లు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్థాయిలో ఆ స్కూల్ నిర్మించారు. దీంతో అత్యాధునాతన సౌకర్యాలతో స్కూల్ సరికొత్త రూపును సంతరించుకుంది.

అయితే, తమ అనుమతి లేకుండా స్వచ్ఛంద సంస్థతో స్కూల్లో పనులు ఎలా చేయించారంటూ గర్ల్స్ హైస్కూల్ ఇంఛార్జి, హెడ్ మాస్టర్ రేఖతో పాటు, మండల విద్యాధికారి నీలకంఠంలకు డీఈవో రాధకిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో అందరూ అవాక్కయ్యారు. కాగా, ఈ స్కూల్ కొత్త బిల్డింగు పనులను ఇంతకు ముందు పని చేసిన డీఈవో రమేశ్ కుమార్ కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించడం గమనార్హం కాగా.. ఇప్పుడు ఇలా హెచ్ఎం, ఎంఈవోలకు నోటీసులు అందించడం విశేషం.