హీరోయిన్ కృతికి చేదు అనుభవం.. అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టి..

తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు ఉన్నారు.

Kaburulu

Kaburulu Desk

March 28, 2024 | 03:50 PM

హీరోయిన్ కృతికి చేదు అనుభవం.. అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టి..

తెలుగు ఇండస్ట్రీలో బోణీ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ కృతి ఖర్బందా. కెరీర్ బిగినింగ్ ఎక్కువగా తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడే సెటిల్ అయ్యింది. తన అందం, అభినయంతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న కృతి ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు తనకు జరిగిన ఓ చేదు అనుభవం గురించి మాట్లాడింది. వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లోకి ఎంతోమంది బాలీవుడ్ హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటారు. 2009లో సుమంత్ హీరోగా నటించిన ‘బోణీ’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ బ్యూటీ కృతి కర్భందా. మొదటి చిత్రం యావరేజ్ టాక్ వచ్చినా.. తర్వాత పవన్ కళ్యాన్ సరసన తీన్మార్, అలాగే మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, హోం త్రీ డి, బ్రూస్‌లీ సినిమాలలో నటించి మెప్పించింది. తెలుగు లో మంచి ఫామ్ లో ఉండగానే.. కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటింది. ఢిల్లీలో పుట్టిన ఈ పంజాబీ బ్యూటీ.. పెరిగిందంతా బెంగళూరులోనే. టాలీవుడ్, శాండల్ వుడ్‌ తన క్రేజ్ తగ్గుతున్న సమయంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రాజ్: రీబూట్, యమ్లా పగ్లా దివానా: ఫిర్‌‌ సే, హౌజ్​ఫుల్ 4, పాగల్​పంతీ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఓటీటీలో రిలీజ్ అయిన తైష్ లో కృతి నటనకు విమర్శకులు నుంచి ప్రశంసలు అందాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తనకు జరిగిన ఓ ఛేదు అనుభవం గురించి చెప్పి బాధపడింది. ఆ ఘటన తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తుందని తెలిపింది. ‘నేను ఓ కన్నడమూవీలో నటిస్తున్న సమయంలో హూటల్ లో బసచేశాం. నేను ఉండే రూమ్ ను తరుచూ చెక్ చేయడం నాకు మొదటి నుంచి అలవాటు. అలా నా గదిని చెక్ చేస్తున్న సమయంలో ఓ కెమెరాను గుర్తించాను.. రూమ్ లోని సెట్ అప్ బాక్స్ వెనుక భాగంలో కెమెరాను అమర్చారు. ఆ కెమెరా చూసి నేను ఒక్కసారే షాక్ అయ్యాను. అప్పటి నుంచి బయటకు ఎక్కడికి వెళ్లినా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా’ అని కృతి కర్బందా చెప్పుకొచ్చారు.