Director Krishna Vamsi : రమ్యకృష్ణ చెన్నైలో, నేనేమో హైదరాబాద్ లో దూరందూరంగా ఉంటున్నాము.. కానీ..
రంగమార్తాండ ప్రమోషన్స్ లో భాగంగా కృష్ణవంశీ ఇటీవల పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడిపోయారని, వేరు వేరుగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ దీనిపై స్పందించారు.
![Director Krishna Vamsi : రమ్యకృష్ణ చెన్నైలో, నేనేమో హైదరాబాద్ లో దూరందూరంగా ఉంటున్నాము.. కానీ..](https://kaburulu.com/wp-content/uploads/2022/08/krishnavamsi.jpg)
Director Krishna Vamsi : గులాబీ, ఖడ్గం, అంతఃపురం, సింధూరం.. లాంటి సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ త్వరలో రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాని తెలుగులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ముఖ్యపాత్రల్లో రంగమార్తాండ సినిమాగా రీమేక్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.
రంగమార్తాండ ప్రమోషన్స్ లో భాగంగా కృష్ణవంశీ ఇటీవల పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడిపోయారని, వేరు వేరుగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ దీనిపై స్పందించారు.
కృష్ణవంశీ మాట్లాడుతూ.. ”ఇలాంటి పుకార్లు చాలా వస్తుంటాయి. నా కెరీర్ మొదట్లోనే ఇలాంటి పుకార్లు చూశాను. వీటిని విని వదిలేస్తాను. వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మేమిద్దరం ప్రస్తుతానికి బాగున్నాము. మా ఇద్దరి మధ్య అదే ప్రేమ బంధం ఇప్పటికీ ఉంది. కాకపోతే తను కెరీర్ లో బిజీగా ఉంది. నేను కూడా రంగమార్తాండ వర్క్ లో బిజీగా ఉన్నాను. ఆందువల్ల కొన్ని నెలలుగా రమ్యకృష్ణ చెన్నైలో, నేను హైదరాబాద్ లో దూరందూరంగా ఉండాల్సి వస్తుంది. అంతేకాని మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు” అని క్లారిటీ ఇచ్చారు.