IRCTC Tour: హైదారాబాద్ వాసుల కోసం IRCTC ఆలోచన… కాశీ నుండి నైమిశారణ్య వరకు తక్కువ ధరలో చుట్టేయొచ్చు…!

ఆధ్యాత్మిక క్షేత్రాలను ప్రదేశాలను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త చెప్పింది ఐఆర్సీటీసీ. ప్రముఖ పురాతన ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసిని సందర్శించాలనుకునే వారికి IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. చాలా విలాసవంతమైన, ఆర్థికంగా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఎయిర్ టూర్ ప్యాకేజీ ‘గంగా రామాయణ యాత్ర‘ని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు .. 6 పగళ్లు ఉంటుంది. ఏప్రిల్ 11, 2023న హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రయాణంలో వారణాసి (కాశీ), ప్రయాగ్రాజ్, సారనాథ్, నైమిశారణ్య వంటి అందమైన ప్రదేశాలను సందర్శిస్తారు.
ప్రయాణీకుల ఎంపిక ఆధారంగా టూర్ ప్యాకేజీలకు టారిఫ్ మారుతూ ఉంటుంది. ధర ప్రయాణీకుడు ఎంచుకున్న ఆక్యుపెన్సీని బట్టి ఉంటుంది. మీరు మీ కోసం ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కాశీ యాత్రకు వెళ్లాలనుకుంటే.. టూర్ ప్యాకేజీ ధరలు తెలుసుకోండి.. ఒకొక్కరికి రూ. 36,850 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల కోసం బుక్ చేయవలసి వస్తే .. మీరు ఒక్కొక్కరికి రూ. 29,900 ఖర్చు చేయాలి. ముగ్గురికి ఈ టూర్ ప్యాకేజీని ఎంచుకోవాల్సి వస్తే.. ఒక్కో వ్యక్తికి రూ.28,200 అవుతుంది. అదే సమయంలో, పిల్లలకు ప్రత్యేక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఈ ప్యాకేజీ కింద వారణాసిని సందర్శించాలనుకుంటే.. IRCTC అధికారిక వెబ్సైట్ని సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు.