ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

Kaburulu

Kaburulu Desk

March 28, 2024 | 03:02 PM

ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

ఇటీవల సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులుతో పాటు ఇంతర సాంకేతిక వర్గానికి చెందినవారు, దర్శక, నిర్మాతలు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లో కాదు అభిమానుల సైతం కన్నీటిపర్యంతం అవుతున్నారు. గుండెపోటు, క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల సినీ, బుల్లితెర ఇండస్ట్రీలో విషాదాలో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మారాఠా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు మిలింద్ సఫాయ్ కన్నుమూశారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మిలింద్ సఫాయ్ మారాఠీ టీవీ సీరియల్ ‘ఆయ్ కుతే కే కర్తే’ ద్వారా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. పోస్టర్ బాయ్స్, చడీ లగే చమ్ చమ్, మేకప్, థాంక్ యు విఠలా, ప్రేమచి గోష్టా, టార్గెట్, బి పాజిటివ్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తిపు తెచ్చుకున్నాడు మిలింద్.

మిలింద్ సఫాయ్ మృతికి ప్రముఖ నటుడు జయవంత్ వాడ్కర్ సొషల్ మీడియా వేదికగా సంతాపాన్ని ప్రకటించారు. మిలింద్ మరణ వార్త తెలిసి ఆయన తోటి కళాకారులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఆగస్టు 24 నిన్న ప్రముఖ మరాఠీ నటి సీమా డియో సైతం ముంబైలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. సీమ గత సంవత్సరం మృతి చెందిన ప్రముఖ నటుడు రమేష్ డియో సతీమణి. ఒక్కరోజు గ్యాప్ లోనే మరాఠా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.