Home » Tag » srisailam
శ్రీశైలంలో ఈనెల 11 న శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం జరగనుంది. ఈ కుంభోత్సవ ఏర్పాట్లపై స్థానిక రెవిన్యూ, పోలీస్, ఆర్టీసి అధికారులతో ఆలయ ఈవో సమన్వయ సమావేశం నిర్వహించారు. 11 న జరిగే కుంభోత్సవం రోజు అమ్మవారికి సాత్విక బలిగా గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలు సమర్పిస్తామన్నారు. అలానే క్షేత్రంలో జీవహింస నిషిద్ధం కారణంగా జంతు, పక్షు బలులు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జంతుబలి నిషేధానికి […]
కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మాఘమాసం పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేపట్టారు. ధర్మ ప్రచార రథంతో శ్రీశైలంలో మొదటిసారిగా ఆలయ సిబ్బంది గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ గంగాధర మండపం నుంచి అంకాలమ్మ ఆలయం, నంది మండపం మీదుగా ఆలయ మహాద్వారం వద్దకు సాగనుంది. మల్లన్న ఆలయంలోని పురాతన మండపాలు, ఆలయాలను సందర్శించే వీలుగా గిరి ప్రదక్షిణను ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది పవిత్ర పౌర్ణమి మాఘమాసం ఆదివారం […]
హిందూధర్మంలోని పవిత్రమైన మాసాలలో ఒకటి మాఘమాసం. ఈ మాసంలో వచ్చే అనేక పర్వదినాలలో ఒకటి మహాశివరాత్రి. హిందువులు జరుపుకునే పండుగల్లో ముఖ్యమైన పండుగ మహా శివరాత్రి. ఈరోజునే లింగోద్భవం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు శివ, పార్వతుల వివాహం కూడా ఈ రోజే జరిగిందని శాస్త్రీయ పురాణాలు చెబుతున్నాయి. మరి ఈ పర్వదినం ఈ ఏడాది ఎప్పుడు వచ్చిందో, ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుండి ప్రారంభం అవుతాయో వంటి విశేషాలను ఇపుడు తెలుసుకుందాం. […]
Srisailam: గత ఆరు నెలలుగా శ్రీశైలం మల్లన్న దేవస్థానంపై విమర్శల జడివాన కురుస్తుంది. ట్రస్ట్ బోర్డు సభ్యులు రెండు వర్గాలు విడిపోయి.. ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడంతో అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ట్రస్ట్ బోర్డు లెటర్ ప్యాడ్ లు, బోర్డు సభ్యుల రెకమెండేషన్లతో కొందరు టికెట్లు లేకుండానే మల్లన్న దర్శనాలకు వెళుతున్నట్లు భారీ విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న లడ్డూల తయారీ ముడి సరుకుల కొనుగోలులో అక్రమాలు జరిగాయని సాక్షాత్తు చైర్మన్ రెడ్డివారి […]
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్యే మూడు రోజుల పాటు పర్యటన నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి క్షేత్రాలు దర్శించుకొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ రాష్ట్రపతికి సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న రాష్ట్రపతి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రాన్ని ఈ నెల 26న దర్శించుకోనున్నారు. నంద్యాల జిల్లాలో గల శ్రీశైల క్షేత్రంలో కొలువుదీరిన […]