Peddada Murthy : వరుస విషాదాలు.. టాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత కన్నుమూత..

విషాదాలు మరవకముందే టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ పాటల రచయిత పెద్దాడ మూర్తి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 51 ఏళ్ళ వయసులో మంగళవారం రాత్రి........

Kaburulu

Kaburulu Desk

January 4, 2023 | 07:45 AM

Peddada Murthy : వరుస విషాదాలు.. టాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత కన్నుమూత..

Peddada Murthy :  గత సంవత్సరంలో టాలీవుడ్ లో అనేకమంది ప్రముఖులు మరణించారు. ఎంతోమంది సినీ పరిశ్రమని, ప్రేక్షకులని వదిలి వెళ్లిపోయారు. టాలీవుడ్ లో వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ విషాదాలు మరవకముందే టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ పాటల రచయిత పెద్దాడ మూర్తి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 51 ఏళ్ళ వయసులో మంగళవారం రాత్రి ఆయన కన్నుమూశారు. బుధవారం నాడు హైదరాబాద్ ఈఎస్‌ఐ శ్మశానవాటికలో పెద్దాడ మూర్తి అంత్యక్రియల్ని నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

వైజాగ్ కి చెందిన మూర్తి జర్నలిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి పలు వార్తాపత్రికలలో పనిచేసి అనంతరం సినీ పరిశ్రమలోకి వచ్చారు. కూతురు అనే సినిమాకి మొదట పాటలు రాశారు. అనంతరం ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, మధుమాసం, పౌరుడు, హౌస్ ఫుల్, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, చందమామ, స్టాలిన్, బలాదూర్.. లాంటి సినిమాలకే కాక మరికొన్ని చిన్న సినిమాలకి కూడా ఆయన పాటలు రాశారు. కొన్ని సినిమాల్లో అన్ని పాటలు రాయగా మరికొన్ని సినిమాల్లో ఒకటి లేదా రెండు పాటలు రాశారు. లాగే కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశారు. పెద్దాడ మూర్తి ఇప్పటివరకు కెరీర్ లో దాదాపు 200 కి పైగా పాటలు రాశారు.

Veera Simha Reddy : వీరసింహారెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ట్రైలర్ కూడా అప్పుడేనా?

పెద్దాడ మూర్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఎన్నో మంచిపాటలు అందించిన ఆయన మరణం టాలీవుడ్ కి తీరని లోటు. పలువురు సినీ ప్రముఖులు ఆయనకి సంతాపం తెలుపుతున్నారు.