Snake In Rajarajeswara Temple: ఆది దంపతుల కళ్యాణోత్సవంలో దర్శనమిచ్చిన నాగుపాము…! ఎక్కడో తెలుసా?

మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్ష చేపట్టి శివాలయానికి వెళ్లి ఆదిదంపతులను దర్శించుకున్నారు. అయితే అదే రోజు మహా అద్భుతం చోటు చేసుకుంది. మహా శివుడి కంఠాభరణం అయిన నాగు పాము భక్తులకు దర్శనం ఇచ్చింది. ఇది చూసిన భక్తులు ఆ పరమ శివుని ప్రతిరూపంగా భావించి భక్తితో పరవిశించిపోయారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది… మరి ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇపుడు తెలుసుకుందాం..
నిర్మల్ జిల్లా దస్తూరబాద్ మండలంలోని రాజేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి వేళ మహా అద్బుతం చోటు చేసుకుంది. రాత్రి శివపార్వతుల కళ్యాణం జరుగుతుంటే నాగు పాము దర్శనం.. లయకారుడైన శంకరుడు కంఠాభరమైన నాగుపాము భక్తులకు దర్శనం ఇచ్చింది. మండలంలోని గొడిసేర్యాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము దర్శనం ఇచ్చింది. నాగుపాముని చూసిన స్థానికులు భక్తి పరవశులయ్యారు. పాముకు భక్తితో పూజలు చేసి పాలు సమర్పించారు. నాగుపాము పడగవిప్పి భక్తులను ఆశ్వీరదించినట్లుగా ప్రత్యక్షమైంది.
మహా శివరాత్రి పర్వదినాన నాగు పాము దర్శనంతో తమ జన్మ ధన్యమైందని స్థానికులు తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి నాగుపాముని దర్శించుకున్నారు. ఇలాంటి అరుదైన సంఘటనలు ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకచోట జరగటం వలన ప్రజలు ఆశ్చర్యానికి గురవుతారు. కాబట్టి ఇలాంటి ఘటనలు జరగటం మూలంగా స్వయంగా భగవంతుడే ప్రత్యక్షమయ్యాడన్న భావన భక్తులలో కలుగుతుంది. తద్వారా ఆధ్యాత్మిక చింతనాసక్తి, దైవభావన ప్రజలలో పెరగడానికి కారణం అవుతుంది.