Jambavantu idol at Tirupati Ontimitta:తిరుపతిలోని ఒంటిమిట్టలో జాంబవంతుని విగ్రహం…!

జాంబవంతుని విగ్రహాన్ని తిరుపతిలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం కల్యాణ వేదిక పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం చెప్పారు. జనవరి 2వ తేదీ , వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్ల ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేసి, ఆ రోజుల్లో దర్శనం సమయం కూడా పెంచాలని అధికారులను ఆదేశించారు.
ఒంటిమిట్ట లోని కల్యాణ వేదిక వద్ద అవసరమైన నిర్మాణాలు చేపట్టి భక్తులు శుభకార్యాలు చేసుకోవడానికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలనని సూచించారు. విగ్రహం పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు, ఉద్యానవనాలను కూడా అభివృద్ధి చేయాలన్నారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం పనుల గురించి అధికారులతో చర్చిస్తూ జనవరి చివరినాటికి ఆలయ నిర్మాణం పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో నటేష్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.