Importance of Sesame seeds and jaggery: సంక్రాంతి పండుగకు నువ్వులు బెల్లం కలుపుకొని తినడం వెనక ఉన్న శాస్త్రీయత ఏంటో తెలుసా…?

సంక్రాంతి పండుగ అనగానే గాలిపటాలు, గంగిరెద్దులాటలు, ముగ్గులు వంటివి గుర్తొస్తాయి. మరి మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే నువ్వులు, బెల్లం ముక్కలను మిక్స్ చేసి స్నేహితులు, బందువులకు పంచి సంక్రాంతిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. పండగ రోజున రైతులు పండించిన ధాన్యాన్ని, చెరకును పక్కవాళ్లకు పంచడం ఆనవాయితీ. అంతే కాకుండా నువ్వుల బెల్లం పంచుకోవడం ద్వారా ఆనందాన్ని పంచుకోవడానికి సంక్రాంతిని చిహ్నంగా కూడా భావిస్తారు.
దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటంటే… శీతాకాలంలో ఈ చల్లని వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి నువ్వులు సహాయపడతాయని చెబుతారు. మారుతున్న వాతావరణంలో శరీరానికి కావాల్సిన పోషకాలను నువ్వులు అందించడమే దీనికి కారణం. నువ్వులలో ఉండే ప్రొటీన్ కండరాలను బలపరుస్తుంది. జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఇది వాత దోష నివారణలో సహాయపడుతుంది. నువ్వులతో పాటు వేరుశనగ, కొబ్బరి, బెల్లం, చెరకు, ఆముదం కూడా పంపిణీ చేస్తారు. ఎందుకంటే పచ్చి శెనగపప్పు, కొబ్బరికాయల్లోని నూనె పదార్థం చర్మానికి మేలు చేస్తుంది.
బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తాయి. ఈ మిశ్రమం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదండీ… సంక్రాంతి నాడు మనం ఆరోగ్యంగా ఉండుటకు తీసుకునే ఆహారం, అలవాట్లు… ఏదేమైనా మన పెద్దలు చాలా ముందుచూపుతో ఆరోగ్యానికి అవసరమైన వాటిని సంప్రదాయంగా మలిచి మన ముందు ఉంచారు. వాటినిప్పుడు మనం పాటించడం ఎంతో ఆరోగ్యకరం, ఆనందకరం.