Gold Ramayana: ప్రజల సందర్శనార్థం బంగారు రామాయణం… ప్రత్యేకత ఏమిటో తెలుసా…?

222 తులాల బంగారం, 10 కిలోల వెండి, వజ్రాలు, పచ్చలు ఇతర విలువైన రత్నాలతో తయారు చేయబడిన ఈ రామాయణాన్ని సంవత్సరానికి ఒకసారి మాత్రమే శ్రీ రామ నవమి సందర్భంగా ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేస్తారు. తర్వాత దీనిని తిరిగి బ్యాంకులో ఉంచుతారు. మరి ఈ రామాయణం ఎవరు రచించారు? దాని ప్రత్యేకతలేమిటి వంటి విషయాల గురించి ఇపుడు తెలుసుకుందాం.
రామాయణం సనాతన హిందూ ధర్మంలో ప్రసిద్ధిగాంచిన గొప్ప గ్రంథంగా ప్రపంచ వ్యాప్తంగా జేజేలు అందుకుంటుంది. వాల్మీకి నుండి తులసీదాసు వరకు చాలా మంది తరతరాలుగా తమదైన రీతిలో రామాయణాన్ని రచించారు. అయితే 1977లో రాంభాయ్ గోకల్భాయ్ రామాయణాన్ని చాలా విశిష్టంగా రాశారు. ఈ రామాయణ పుస్తకం బంగారం, 10 కిలోల వెండి, నాలుగు వేల వజ్రాలు, కెంపులు, పచ్చలు, విలువైన ముత్యాలు , నీలమణిలతో తయారు చేయబడింది. ఈ పుస్తకం విలువ మార్కెట్ విలువ కోట్లలో ఉంటుంది.
విహెచ్పి ర్యాలీ సందర్భంగా శ్రీ రామనవమి సందర్భంగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ విలువైన పుస్తకాన్ని ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచారు. స్వర్ణ రామాయణం అని పిలువబడే ఈ పుస్తకంలోని ప్రధాన పేజీలో 11.6 గ్రాముల బంగారంతో చేసిన శివుడు, 5.8 గ్రాముల బంగారంతో చేసిన హనుమంతుని విగ్రహం ఉంది. సూరత్లోని భేస్తాన్లోని లుహర్ పలియాలో నివసించే రామభక్తుడైన రాంభాయ్ గోకల్భాయ్ 1981లో ఈ రామాయణాన్ని రచించాడు. 530 పేజీల పుస్తకాన్ని 9 నెలల 9 గంటల్లో పూర్తి చేశారు.