త్రివిక్రమ్ సతీమణి సౌజన్య శ్రీనివాస్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పవన్ గారు, మావారు మధ్య గొప్ప స్నేహమే ఉంది. ఒకర్ని ఒకరు ఎంతో గౌరించుకుంటారు.
ఇక ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకోవడం స్టార్ట్ చేశారంటే చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోతారు.
ఎక్కువుగా తత్వశాస్త్రం, పురాణాల గురించే మాట్లాడుకుంటారు.
వాళ్లిద్దరూ ఒకరికి ఒకరు ఇచ్చుకునే బహుమతులు ఏమన్నా ఉన్నాయి అంటే అవి పుస్తకాలు, పెన్నులే మాత్రమే.
కళ్యాణ్ గారికి మా ఇంటి వంట అంటే చాలా ఇష్టం.
మార్నింగ్ టైంలో వస్తే ఉప్మా అడిగి మరీ చేయించుకుంటారు. మధ్యాహ్న భోజనంలో వెజిటేరియన్ వంటలు, ఆవకాయ ఇష్టంగా తింటారు.
ఊరగాయలు, రవ్వలడ్డూలు అయితే అడిగి మరీ తింటారు. అడగడానికి అస్సలు మొహమాట పడరు. మా ఇంటిలో వ్యక్తిలా కలిసిపోతారు అంటూ చెప్పుకొచ్చింది.