ఇటీవల సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (CCL) తిరిగి మళ్ళీ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది మొత్తం 8 టీంలు పోటీ చేయగా, సెమీ ఫైనల్స్‌కి.. Bhojpuri Dabanggs, Mumbai Heroes, Telugu Warriors, Karnataka Bulldozers చేరుకున్నాయి.

నిన్న (మార్చి 24) సెమీ ఫైనల్స్ జరగగా.. Mumbai Heroes పై Bhojpuri Dabanggs గెలుపు సాధించి ఫైనల్స్‌కి వెళ్లారు.

ఇక Telugu Warriors, Karnataka Bulldozers మధ్య జరిగిన పోరు హోరాహోరీగా జరిగింది. 

రెండు ఇన్నింగ్స్‌ అనంతరం కర్ణాటక టీం, తెలుగు టీంకి 103 పరుగులు టార్గెట్ ఇచ్చారు.

ఫైనల్ ఓవర్ వచ్చేపాటికి 6 వికెట్లు కోల్పోయి గ్రీస్‌లో థమన్, ప్రిన్స్ నిలిచారు.

లాస్ట్ ఓవర్‌లో 8 కొట్టాలి అనగా.. థమన్ రెండు 4‌లతో టీంని ఫైనల్‌కి తీసుకు వెళ్ళాడు.

ఈరోజు (మార్చి 25) విశాఖపట్నంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.