శృతి హాసన్ ప్రభాస్ సలార్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
కేజీఎఫ్ చిత్రాలు తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడం..
ఈ మూవీ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
దాదాపు 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీ..
రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ మూవీ సెట్స్ నుంచి శృతి హాసన్ ఒక అప్డేట్ ఇచ్చింది.
ఈ మూవీలో తన షూటింగ్ పార్ట్ పూర్తీ అయ్యినట్లు తెలియజేస్తూ..
సెట్లో దర్శకుడు ప్రశాంత్ నీల్, కెమెరా మ్యాన్ భువన్ గౌడతో దిగిన ఫోటోను షేర్ చేసింది.