మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కువ శాతం మాలలో కనిపిస్తూ ఉంటాడు.
కాగా ఇటీవల ఆస్కార్ అవార్డు వేడుకల్లో పాల్గొనేందుకు రామ్ చరణ్ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.
అమెరికా బయలుదేరినప్పుడు చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నాడు.
అయితే తాజా ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాలలో కనిపించలేదు.
దీంతో ఎలా పడితే అలా ఆచరించే క్రమంలో మాలని స్వీకరించకండి అంటూ సోషల్ మీడియాలో చరణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇది కాస్త కాంట్రవర్సీ అవుతుండడంతో రామ్ చరణ్ సన్నిహితుల నుంచి క్లారిటీ వచ్చింది.
రామ్ చరణ్ స్వామి 21 రోజుల అర్ధ మండల దీక్ష చేపట్టారని, ఫిబ్రవరి స్టార్టింగ్లో దీక్ష మొదలైందని..
అమెరికా వెళ్లే రోజు దీక్షలోని చివరి రోజట, దీక్షా కాలం పూర్తీ కావడంతో అమెరికాలోని.. ఒక టెంపుల్లో రామ్ చరణ్ పద్ధతి ప్రకారమే మాల తీసినట్లు వెల్లడించారు.