నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే.
దీని కోసం రాజమౌళి అండ్ టీం ఆస్కార్ క్యాంపైన్ అంటూ 80 కోట్లు ఖర్చు చేశారంటూ తమ్మారెడ్డి భరద్వాజ్ వ్యాఖ్యానించడం ఇటీవల సంచలనం సృష్టించింది.
తాజాగా దీని పై రాజమౌళి కొడుకు కార్తికేయ రియాక్ట్ అయ్యాడు.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ..
క్యాంపైన్ కోసం మొదట 5 కోట్ల బడ్జెట్ అనుకున్నాము. ఆస్కార్ నామినేషన్స్ లో ఎంట్రీ ఇచ్చే సమయానికి 3 కోట్ల వరకు ఖర్చు అయ్యింది.
నామినేట్ అయ్యాక బడ్జెట్ కొంచెం పెంచాం. దీంతో మొత్తం క్యాంపైన్ ఖర్చు 8.5 కోట్లు అయ్యింది.
ఇక ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్కి ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ మాత్రమే ఆహ్వానం వచ్చింది.
రాజమౌళి సహా మా కుటుంబం 750 డాలర్లు పెట్టి టికెట్ కొనుకొని ఆస్కార్ వెళ్ళాము.