2020లో నితిన్ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భీష్మ.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమాలో నితిన్ అండ్ రష్మిక మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది.

వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.

మరోసారి ఈ హిట్ కాంబినేషన్‌ని మైత్రి మూవీ మేకర్స్ సెట్ చేస్తున్నారు.

ఈ ముగ్గురితో ఈ నెల 24న మైత్రి మేకర్స్ కొత్త సినిమాని లాంచ్ చేయబోతున్నారు.

భీష్మతో ఆకట్టుకున్న వెంకీ, నితిన్, రష్మిక..

మరోసారి కూడా ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేయగలరా? లేదా? చూడాలి.