ఇటీవల మంచు బ్రదర్స్ విష్ణు అండ్ మనోజ్ గొడవ పడుతున్న వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
కొన్ని రోజులుగా తన అనుచరుల పై మంచు విష్ణు ఏదో విధంగా గొడవకి దిగుతున్నట్లు మంచు మనోజ్ ఆ వీడియో పోస్ట్ చేశాడు.
వెంటనే మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చి ఆ వీడియోని డిలీట్ చేయించిన సంగతి తెలిసిందే.
తాజాగా మనోజ్ మరో రెండు సంచలన పోస్ట్లు వేశాడు.
తప్పు అని తెలిసి కూడా ప్రశ్నించకుండా ఉండడం కంటే, నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధం.
క్రియేటివిటీకి నెగిటివిటీనే శత్రువు అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
అయితే ఈ గొడవ గురించి మంచు లక్ష్మి.. అసలేమీ తెలియదు అంటూ బదులిస్తుంది.