ఎం ఎం కీరవాణి నాటు నాటు పాటకి ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే.
తాజాగా ఒక బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీరవాణి మాట్లాడుతూ..
నాకు ఇది రెండో ఆస్కార్. నేను గెలుచుకున్న తొలి ఆస్కార్ రామ్ గోపాల్ వర్మ.
నా కెరీర్ మొదటిలో నన్ను ఎవరు నమ్మలేదు. కానీ వర్మ నన్ను నమ్మి 'క్షణం క్షణం' సినిమా ఇచ్చాడు.
వర్మ ఛాన్స్ ఇచ్చాడు అంటే మనం కూడా తనతో వర్క్ చేద్దామని, అప్పటి వరకు నన్ను పట్టించుకోని వాళ్ళు కూడా పిలిచి ఆఫర్లు ఇచ్చారు.
రామ్ గోపాల్ వర్మ కెరీర్లో శివ ఆస్కార్ రోల్ ప్లే చేస్తే, నా కెరీర్లో RGV ఆస్కార్ రోల్ ప్లే చేశాడని చెప్పాడు.
ఇక వ్యాఖ్యలకు వర్మ తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు.
హే కీరవాణి నాకు చనిపోయిన భావన కలుగుతుంది. ఎందుకంటే చచ్చిన వాళ్లనే ఇలా పొగుడుతారు అంటూ ట్వీట్ చేశాడు.