కియారా అద్వానీ, బాలీవుడ్ హీరో సిద్దార్ద్ మల్హోత్రాతో ప్రేమలో ఉంది అంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విషయంపై వీరిద్దరూ ఎప్పుడు స్పందించ లేదు.

తాజాగా వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించి, ప్రేమ వార్తలు నిజమని తెలియజేశారు.

ఫిబ్రవరి 4-6 వరకు ఈ వివాహ వేడుకలు రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో జరగనున్నాయి.

ఈ క్రమంలోనే ఈరోజు కియారా అద్వానీ కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో ముంబై నుంచి రాజస్థాన్‌కి బయలుదేరింది.

ఫిబ్రవరి 4, 5 తేదీల్లో మెహందీ, హల్దీ, సంగీత్ ఈవెంట్స్ జరగనున్నాయి.

ఫిబ్రవరి 6న వీరిద్దరూ పంజాబీ సంప్రదాయంలో ఒకటి కానున్నారు.

ఈ వివాహానికి బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు హాజరుకాబోతున్నారు.