క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కలిసి చేసిన మూడో చిత్రం 'పుష్ప'.
రీజినల్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా హిట్టుని సొంతం చేసుకుంది.
రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పుష్ప-2లో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటించబోతుంది అంటూ గట్టిగా వార్తలు వినిపించాయి.
ఈ క్రమంలోనే ఈరోజు ట్విట్టర్లో #SaiPallavi, #PushpaTheRule హ్యాష్ ట్యాగ్లు ట్రేండింగ్లో నిలిచాయి.
అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో అనేది తెలియదు.
కాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 7న..
దేశముదురు సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమాతో పాటు పుష్ప-2 గ్లింప్స్ కూడా ప్రదర్శించబోతున్నారని సమాచారం.