ఒకప్పుడు సినిమాల్లో విలన్‌గా చేసిన 'పొన్నంబలం' గుర్తుండే ఉంటాడు.

అతను కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు.  చికిత్స చేయించుకోడానికి డబ్బులు లేక ఆత్మహత్య చేసుకొనే ఆలోచన కూడా చేశాడట.

ఇక ఇటీవల తన ఆరోగ్యం గురించి చెబుతూ చిరంజీవి మెసేజ్ చేశాడట.

5 నిమిషాల్లో చిరు ఫోన్ చేసి.. నీ దగ్గరిలో ఉన్న అపోలో హాస్పిటల్‌కి వెళ్ళమని చెప్పాడట.

హాస్పిటల్ ఎంట్రీ ఫీస్ కూడా తీసుకోకుండా తనకి ఆపరేషన్ చేశారట.

సహాయం అడిగితే 1 లక్షో, 2లక్షలో ఇస్తారు అనుకున్నాను. కానీ,

మొత్తం హాస్పిటల్ ఖర్చు 40 లక్షల చిరంజీవి చూసుకున్నాడు అంటూ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.