ఒకప్పుడు సినిమాల్లో విలన్గా చేసిన 'పొన్నంబలం' గుర్తుండే ఉంటాడు.
అతను కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకోడానికి డబ్బులు లేక ఆత్మహత్య చేసుకొనే ఆలోచన కూడా చేశాడట.
ఇక ఇటీవల తన ఆరోగ్యం గురించి చెబుతూ చిరంజీవి మెసేజ్ చేశాడట.
5 నిమిషాల్లో చిరు ఫోన్ చేసి.. నీ దగ్గరిలో ఉన్న అపోలో హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాడట.
హాస్పిటల్ ఎంట్రీ ఫీస్ కూడా తీసుకోకుండా తనకి ఆపరేషన్ చేశారట.
సహాయం అడిగితే 1 లక్షో, 2లక్షలో ఇస్తారు అనుకున్నాను. కానీ,
మొత్తం హాస్పిటల్ ఖర్చు 40 లక్షల చిరంజీవి చూసుకున్నాడు అంటూ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.