Suhasini Manirathnam : పొన్నియిన్ సెల్వన్ కథ వల్ల మా పెళ్లి ఆగిపోతుందేమో అని భయపడ్డాను..

Kaburulu

Kaburulu Desk

September 24, 2022 | 09:05 AM

Suhasini Manirathnam : పొన్నియిన్ సెల్వన్ కథ వల్ల మా పెళ్లి ఆగిపోతుందేమో అని భయపడ్డాను..

Suhasini Manirathnam : మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, జయం రవి, జయరాం, ప్రభు.. ఇలా చాలా మంది స్టార్స్ తో తెరకెక్కిన సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకి రానుంది.

శుక్రవారం సాయంత్రం పొన్నియిన్ సెల్వన్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి స్టార్స్ అంతా తరలి వచ్చారు. తెలుగులో ఈ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈవెంట్లో సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశారు.

సుహాసిని ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. ”మా పెళ్ళికి ముందు మణిగారు నాకు ఓ పెద్ద బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చారు. నేను అందులో ఏవైనా బట్టలు ఉన్నాయేమో గిఫ్ట్ అనుకున్నాను. ఓపెన్ చేసి చూస్తే పొన్నియిన్ సెల్వన్ బుక్ అయిదు భాగాలు ఉన్నాయి. వాటన్నిటిని చదివి ఒక లైన్ లో కథ రాసివ్వు అన్నారు. నన్ను టెస్ట్ చేస్తున్నారేమో అనుకున్నాను. వారం రోజుల్లో మొత్తం చదివి అయిదు లైన్స్ లో కథ రాసిచ్చాను. అది చూసి ఇలాగేనా రాసేది, ఇలా రాస్తారా అని అన్నారు. దీంతో నేను రాసింది నచ్చలేదేమో, మా పెళ్లి ఆగిపోతుందేమో అని భయపడ్డాను. కానీ మా పెళ్లి అయింది. మా పెళ్లి అయిన 34 ఏళ్ళ తర్వాత ఆయన ఈ సినిమాని తీశారు” అని తెలిపారు.

Rana Naidu Teaser : రానా నాయుడు టీజర్.. ఫైర్ మీద ఉన్న వెంకిమామ, రానా.. టీజర్ తోనే దుమ్ము దులిపేశారుగా..

ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ”ఇది తమిళ కథ అయినా తెలుగు స్టేట్స్ లోనే ఎక్కువగా షూట్ చేశాం. రాజమండ్రి, హైదరాబాద్ లో ఎక్కువ భాగం షూట్ చేశాం. అందుకే ఇది తెలుగు సినిమా. నన్ను 42 ఏళ్లుగా ఆదరిస్తున్నారు. నా కోసం నా మీద చూపించే ప్రేమని ఈ సినిమాపై చూపించండి” అని అన్నారు.