Gautha Menon : ఏ మాయ చేసావే మహేష్ బాబుతో తీద్దామనుకున్నాను.. కానీ ఆయన..

Kaburulu

Kaburulu Desk

September 19, 2022 | 08:53 AM

Gautha Menon : ఏ మాయ చేసావే మహేష్ బాబుతో తీద్దామనుకున్నాను.. కానీ ఆయన..

Gautha Menon :  లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్స్ ని అద్భుతంగా తెరకెక్కించే దర్శకుల్లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒకరు. ఆయన తమిళ్ లో తీసిన సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అయి ఇక్కడ కూడా మంచి విజయం సాధించాయి. తెలుగులో ఘర్షణ, ఏ మాయ చేసావే, సాహసం శ్వాసగా సాగిపో లాంటి సినిమాలతో మెప్పించారు. ఇటీవలే శింబు, సిద్ది ఇదాని జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ది లైఫ్ అఫ్ ముత్తు’ సినిమాని విడుదల చేశారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ పాత విషయాలని గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏ మాయ చేసావే సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాకి సీక్వెల్ కూడా తీస్తా అని తెలిపారు. అయితే ఈ సినిమా స్టోరీ నాగచైతన్య కంటే ముందు మహేష్ కి చెప్పారని తెలిపారు.

Krithi Shetty : కృతిశెట్టి ఏం చదువుతుందో తెలుసా..? కృతి చాలా ట్యాలెంట్..

ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. ఏ మాయ చేసావే సినిమా ముందు తమిళంలో తీద్దాం అనుకున్నాను. ఆ తర్వాత మంజుల గారికి కథ చెప్పి మహేష్ తో తీస్తాను అని అడిగితే స్టోరీ చెప్పు కానీ మహేష్ ఇలాంటి కథ ఒప్పుకోడేమో అని మహేష్ దగ్గరికి పంపించింది. మహేష్ కి ఏ మాయ చేసావే కథ మొత్తం చెప్పాక ఇది చాలా చిన్న స్టోరీ, మీరు, నేను కలుస్తున్నామంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఏదైనా యాక్షన్ సినిమా భారీగా చేద్దాం అన్నారు. దీంతో ఆ కథ తర్వాత నాగ చైతన్యకి చెప్పాను” అని తెలిపారు. మహేష్ ఏ మాయ చేసావే సినిమాకి నో చెప్పడంతో ఒక మంచి క్లాసిక్ సినిమా మిస్ అయ్యాడని అభిమానులు ఫీల్ అవుతున్నారు.