Dongalunnaru Jaagratha Trailer : కారులో ఇరుక్కున్న హీరో.. కారులో బాంబ్.. దొంగలున్నారు జాగ్రత్త ట్రైలర్ రిలీజ్..

Kaburulu

Kaburulu Desk

September 15, 2022 | 01:55 PM

Dongalunnaru Jaagratha Trailer : కారులో ఇరుక్కున్న హీరో.. కారులో బాంబ్.. దొంగలున్నారు జాగ్రత్త ట్రైలర్ రిలీజ్..

Dongalunnaru Jaagratha Trailer :  మత్తు వదలరా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కీరవాణి రెండో తనయుడు శ్రీసింహ. ఆ సినిమాతో మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత తెల్లారితే గురువారం సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందాడు. ఇప్పుడు దొంగలున్నారు జాగ్రత్త అంటూ మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు శ్రీసింహ.

శ్రీసింహ హీరోగా, ప్రీతీ అస్రాని హీరోయిన్ గా కొత్త దర్శకుడు సతీష్ త్రిపుర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సురేష్ బాబు, సునీత తాటి కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా, సస్పెన్స్ తో కూడుకుంది.

Krithi Shetty : ‘ఆ అమ్మాయిగురించి మీకు చెప్పాలి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చీరలో మెరిసిన కృతిశెట్టి

ట్రైలర్ లో.. హీరో దొంగతనాలు చేస్తూ ఉంటాడని, ఒక కారు దొంగతనం చేయడానికి వచ్చి అందులో ఇరుక్కుపోతాడు, ఎవర్ని హెల్ప్ అడిగినా కారు ఓపెన్ చేయలేకపోతారు, అంతలో ఆ కారులో బాంబు కనిపిస్తుంది. అలాగే కార్ లో ఉన్న బ్లూటూత్ ద్వారా ఒక కాల్ వచ్చి హీరోని భయపెడుతుంది. మరి హీరో కారులోంచి బయటకి వచ్చాడా? బాంబు పేలిందా? పేలలేదా? హీరో తప్పించుకున్నాడా? అన్నట్టు ఆసక్తికరంగా చూపించారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్ధమవుతుంది. దొంగలున్నారు జాగ్రత్త సినిమా సెప్టెంబర్ 23న రిలీజ్ కానుంది.