Raghu Rama Krishna Raju : చిరు, బాలయ్య ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలి అంటున్న వైసీపీ ఎంపీ..

తెలుగు వారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. దీంతో ఈ బరిలో నిలవడానికి స్టార్ హీరోలంతా పందెం కోళ్లులా సిద్దమవుతుంటారు. ఇక ఈ ఏడాది చిరు 'వాల్తేరు వీరయ్య'గా వస్తుంటే, బాలయ్య 'వీరసింహారెడ్డి'గా తొడ కొడుతున్నాడు. అయితే ఈ చిత్రాల విడుదలపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన ట్వీట్ చేశాడు.

Kaburulu

Kaburulu Desk

January 10, 2023 | 08:06 PM

Raghu Rama Krishna Raju : చిరు, బాలయ్య ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలి అంటున్న వైసీపీ ఎంపీ..

Raghu Rama Krishna Raju : తెలుగు వారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. దీంతో ఈ బరిలో నిలవడానికి స్టార్ హీరోలంతా పందెం కోళ్లులా సిద్దమవుతుంటారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి రేస్ లో టాలీవుడ్ బడా హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహ బాలకృష్ణ నిలిచారు. చిరు ‘వాల్తేరు వీరయ్య’గా వస్తుంటే, బాలయ్య ‘వీరసింహారెడ్డి’గా తొడ కొడుతున్నాడు. ఈ రెండు చిత్రాలు పై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య సాంగ్‌ని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి.. వీరసింహారెడ్డి కారణమా?

అంతేకాదు ఈ సినిమాల్లో బాలకృష్ణ, చిరంజీవి వింటేజ్ లుక్స్ లో కనిపిస్తుండడంతో జనరల్ ఆడియన్స్ లో కూడా ఈ మూవీస్ పై ఆశక్తి నెలకుంది. కాగా ఈ రెండు సినిమాలు ఒక రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మొదటిగా వీరసింహారెడ్డి జనవరి 12న బరిలోకి దిగుతుండగా, ఆ నెక్స్ట్ డే జనవరి 13న వాల్తేరు వీరయ్య రిలీజ్ అవుతుంది. అయితే ఈ చిత్రాల విడుదలపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన ట్వీట్ చేశాడు.

“సంక్రాంతికి విడుదల కానున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు చిత్రాలు హిట్ అవ్వాలి. మా పార్టీకి చెందినవారు వేరే పేర్లతో తప్పుడు రివ్యూలు రాస్తారు. ఒకరి ఫ్యాన్స్ గా చెప్పుకుంటూ మరొకరిపై విమర్శలు గుప్పిస్తారు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ అప్రమత్తంగా ఉండాలి” అంటూ ట్వీట్ చేశాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నయ కావడం. అలాగే బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే కావడంతో.. వైసీపీ ప్రభుత్వం ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో అయన ఇలా ట్వీట్ చేశాడు అంటున్నారు నెటిజెన్లు.

కాగా ఈ రెండు సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునేలా అవకాశం ఇచ్చింది జగన్ సర్కార్. గత కొంత కాలంగా ఏపీలో టికెట్ ధరల వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరికి అనుకూలంగా ప్రభుత్వం ఈ తీపి కబురు చెప్పడంతో చిత్ర నిర్మాతలు సంతోషంలో ఉన్నారు.