Vijay : స్టేజీపై ‘రంజితమే’ పాట పాడి అదరగొట్టిన విజయ్..

Kaburulu

Kaburulu Desk

December 25, 2022 | 04:30 PM

Vijay : స్టేజీపై ‘రంజితమే’ పాట పాడి అదరగొట్టిన విజయ్..

Vijay : ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వారిసు’. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగులో ‘వారసుడు’ పేరుతో రిలీజ్ అవుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న చెన్నైలో ఘనంగా జరిగింది.

Dil Raju : తమిళ సినిమా నుంచి తప్పుకున్న దిల్ రాజు?

కాగా ఈ సినిమాలోని ‘రంజితమే’ సాంగ్ ఎంతటి హిట్టు అయ్యిందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. 100 మిలియన్ లకు పైగా వ్యూస్ అందుకొని రికార్డు సృష్టించింది. ఈ పాటని సినిమాలో కూడా హీరో విజయ్‌నే పాడాడు. దీంతో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజీపై అభిమానుల మధ్యలో పాడి అదరగొట్టేశాడు. పాడడమే కాదు డాన్స్ కూడా వేసి ఆడిటోరియం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసాడు.

అందుకు సంబంధించిన వీడియోని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది. ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగు, తమిళ భాషల్లో ఒకేరోజు విడుదలవుతుంది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేయనున్నారు మేకర్స్.