Unstoppable : అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్ రిలీజ్.. శర్వానంద్, అడివి శేష్‌లతో కలిసి రచ్చ రచ్చ చేసిన బాలయ్య

Kaburulu

Kaburulu Desk

November 4, 2022 | 10:51 AM

Unstoppable : అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్ రిలీజ్.. శర్వానంద్, అడివి శేష్‌లతో కలిసి రచ్చ రచ్చ చేసిన బాలయ్య

Unstoppable :  బాలకృష్ణ హోస్ట్ గా మారి అన్‌స్టాపబుల్ షోని సూపర్ గా నడిపిస్తున్నారు. రెండో సీజన్ గ్రాండ్ గా కొనసాగుతోంది. అన్‌స్టాపబుల్ లో ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి కాగా తాజాగా మూడో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు, లోకేష్ రాగా రెండో ఎపిసోడ్ లో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చారు. తాజాగా మూడో ఎపిసోడ్ లో యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్ వచ్చి సందడి చేశారు.

ఈ ఎపిసోడ్ లో బాలయ్య యువ హీరోలతో సరదగా మాట్లాడుతూ, ఆడుతూ, వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేసి రచ్చ చేశారు. ఫుల్ ఫన్ గా సాగింది ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో చర్చించిన అంశాలు ఇవే..

ముందుగా శర్వా షోలోకి రాగానే బాలకృష్ణ క్రష్ రష్మిక అని చెప్పారని రష్మికకి వీడియో కాల్ చేసి బాలకృష్ణతో మాట్లాడించాడు శర్వా.

మొదట అడివి శేష్ ని అభినందిస్తూ గూడాచారి సీక్వెల్ సినిమాలో తనకి కూడా ఓ అవకాశం ఇమ్మని అడిగారు బాలయ్యబాబు.

చిన్నప్పుడు మీ టాప్ హీరో సినిమా చూసి బీడీలు తాగాలి బాబు అని పాటని పాడితే మా అమ్మ ప్లేట్ తో నా నెత్తి మీద కొట్టింది అని చెప్పాడు అడివి శేష్.

మీరు 100కి పైగా సినిమాలు, దాదాపు ఓ 30 మంది హీరోయిన్స్ తో చేశారు మీ మీద రూమర్స్, గాసిప్స్ ఎందుకు రాలేదు అని శర్వానంద్ అడగగా బాలయ్య మీద రూమర్స్ రాసే దమ్ముందా?? అని సరదాగా అన్నారు బాలయ్య.

ఇటీవల మీడియాలో బాగా వైరల్ అవుతున్న సిద్దార్థ్, అదితి రావు హైదరీ రిలేషన్ గురించి శర్వానంద్ మాట్లాడుతూ.. ఏమో నిజంగానే రిలేషన్ లో ఉన్నారేమో అని అన్నాడు.

ఇటీవల శర్వానంద్ నుంచి వచ్చిన ఒకేఒక జీవితం సినిమా తనకి బాగా నచ్చిందని, అది చూశాక నా ఆదిత్య 369 గుర్తొచ్చింది బాలయ్య అన్నారు. అలాగే ఆదిత్య 999 మ్యాక్స్ కథ రాసేసాను. త్వరలో చేయబోతున్నాను అని అన్నారు బాలకృష్ణ.

ఆ తర్వాత యువ హీరోలతో కలిసి బాలయ్య బాబు డ్యాన్సులు వేసి రచ్చ చేశారు.

శర్వానంద్ రానాకి కాల్ చేయగా, అడివి శేష్ వాళ్ళ అమ్మకి కాల్ చేశాడు. ఇద్దరితో బాలయ్య బాబు మాట్లాడారు. శేష్ పెళ్లి కూడా చేస్తాను అంటూ అన్ స్టాపబుల్ .. ఇక్కడ పెళ్లిళ్లు చేయబడును అని అన్నారు.

ఆ తర్వాత హీరోయిన్స్ గురించి ప్రశ్నలు అడిగారు బాలయ్య. రష్మిక, సాయి పల్లవి, పూజ హెగ్డే.. ఇలా హీరోయిన్స్ గురించి మాట్లాడారు.

శర్వానంద్ వాళ్ళ తాతయ్య ఎన్టీఆర్ గారి దగ్గర చార్టెడ్ అకౌంట్ అని వాళ్ళ తాత గురించి మాట్లాడారు. శర్వానంద్, బాలకృష్ణ ఆస్తులు అంటూ సరదాగా మాట్లాడారు.

జాను సినిమా సమయంలో స్కై డైవింగ్ కోసం ఫ్లైట్ నుంచి కిందకి దూకితే పారాచూట్ మధ్యలో పనిచేయక కిందపడ్డానని, కోలుకోవడానికి రెండున్నరేళ్లు పట్టిందని, చేతికి రెండు ప్లేట్స్, 24 నట్లు, కాలికి ఒక ప్లేట్ పడ్డాయని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

బాలకృష్ణ కూడా పవిత్ర ప్రేమ సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో ఫైట్ కోసం ఏర్పాటు చేసిన బాంబ్ బ్లాస్టింగ్ గట్టిగా తగిలిందని చెప్పాడు.