Sai Pallavi : సినిమాలకి దూరంగా సాయి పల్లవి.. సడెన్ గా పుట్టపర్తిలో ప్రత్యక్షం..

మూడు నెలల క్రితం ఓ అవార్డు ఫంక్షన్ లో చివరిసారిగా కనిపించిన సాయి పల్లవి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత సడెన్ గా నేడు పుట్టపర్తి సాయిబాబా ఆలయంలో కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా పుట్టపర్తి సాయిబాబా ప్రశాంత నిలయంలో.............

Kaburulu

Kaburulu Desk

January 1, 2023 | 03:40 PM

Sai Pallavi : సినిమాలకి దూరంగా సాయి పల్లవి.. సడెన్ గా పుట్టపర్తిలో ప్రత్యక్షం..

Sai Pallavi :  స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ వేరు. చేసింది తక్కువ సినిమాలే అయినా సినిమాల్లో తన నటన, డ్యాన్స్, బయట తన మంచితనం, అందరితో మంచిగా ఉండే విధానం చూసి తనకి ఎక్కువమంది అభిమానులు అయ్యారు. హీరోలకి మించిన క్రేజ్ సాయి పల్లవికి సొంతం. డైరెక్టర్ సుకుమార్ సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని సంబోధించాడంటే అర్ధం చేసుకోవచ్చు ఆమెకి ఎంత క్రేజ్ ఉందో. స్టేజి మీద హీరోలు ఉన్నా సాయి పల్లవి కోసం అభిమానులు అరిచిన సందర్భాలు ఉన్నాయి.

తెలుగు, మలయాళం, తమిళ్ లో వరుస సినిమాలు చేస్తున్న సాయి పల్లవి సడెన్ గా సినిమాలు ఆపేసింది. చివరిసారిగా గార్గి సినిమాలో నటించింది. ఆ సినిమా ప్రమోషన్స్ లో చివరిసారిగా మీడియాలో కనిపించింది. అప్పట్నుంచి సాయి పల్లవి ఎలాంటి కొత్త సినిమా ఒప్పుకోలేదు, తన సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టీవ్ గా లేదు. దీంతో సాయి పల్లవి సినిమాలకి దూరం అయిందని, తాను డాక్టర్ కావడంతో సొంతంగా హాస్పిటల్ పెట్టే ఆలోచనలో ఉందని వార్తలు వచ్చాయి. అయితే వీటిపై సాయి పల్లవి స్పందించలేదు.

Raviteja : 75 కోట్ల ధమాకా.. 100 కోట్లకి పరుగులు.. ఈ సక్సెస్ వాళ్ళకి అంకితం అంటూ రవితేజ ఎమోషనల్ ట్వీట్..

మూడు నెలల క్రితం ఓ అవార్డు ఫంక్షన్ లో చివరిసారిగా కనిపించిన సాయి పల్లవి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత సడెన్ గా నేడు పుట్టపర్తి సాయిబాబా ఆలయంలో కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా పుట్టపర్తి సాయిబాబా ప్రశాంత నిలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అనేక మంది భక్తులు ఈ వేడుకలకి హాజరవుతున్నారు. సాయి పల్లవి కూడా అందరు సాధారణ భక్తుల లాగే సంప్రదాయంగా చీరలో వచ్చి భక్తుల మధ్యే కూర్చొని ప్రార్థనలు చేసుకొని వెళ్ళిపోయింది. సాయి పల్లవిని గమనించి కొంతమంది తమ ఫోన్స్ లో వీడియోలు తీయగా ఆ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. దాదాపు మూడు నెలల తర్వాత సాయి పల్లవి కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయి పల్లవి ఎవరితో ఏమి మాట్లాడకుండానే వచ్చి కాసేపు దైవ చింతనలో గడిపి వెళ్ళిపోయింది.