Rashmika Mandanna : సమంతని అమ్మలా దగ్గరుండి చూసుకోవాలని ఉంది..

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు రెండు నెలల క్రితం తన యశోద సినిమా రిలీజ్ అప్పుడు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. తాజాగా బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రష్మిక.

Kaburulu

Kaburulu Desk

January 4, 2023 | 01:48 PM

Rashmika Mandanna : సమంతని అమ్మలా దగ్గరుండి చూసుకోవాలని ఉంది..

Rashmika Mandanna :  నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీలలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. త్వరలో రష్మిక నటించిన తమిళ సినిమా వరిసు, హిందీ సినిమా మిషన్ మజ్ను సినిమాలు రిలీజ్ కి రెడీ అవ్వనున్నాయి. దీంతో రష్మిక ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది. తాజాగా బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు రెండు నెలల క్రితం తన యశోద సినిమా రిలీజ్ అప్పుడు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఇంటివద్దే ఉంటూ సమంత మయోసైటిస్ కి చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. సమంత త్వరగా కోలుకోవాలని, మళ్ళీ వరుసగా సినిమాలు చేయాలని ఆమె అభిమానులు, ప్రేక్షకులు, సెలబ్రిటీలు కోరుకుంటున్నారు. తాజాగా సమంత ఆరోగ్యంపై రష్మిక వ్యాఖ్యలు చేసింది.

Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో కలిసి మళ్ళీ సినిమా చేస్తా.. చాలా మంది అడుగుతున్నారు..

రష్మిక మాట్లాడుతూ.. సమంత నాకు చాలా ఇన్స్పిరేషన్. సమంత నాకు మంచి స్నేహితురాలు కూడా. ఆమె మయోసైటిస్ తో బాధపడుతున్నట్టు తను ప్రకటించేదాకా కూడా నాకు తెలీదు. అందరికి ఎలా తెలిసిందో నాకు కూడా అలాగే తెలిసింది. సమంత ఒక గొప్ప మహిళ. అందర్నీ చాలా బాగా చూసుకుంటుంది. సమంత జీవితంలో ఎన్నో సవాళ్ళని ధైర్యంగా పోరాడి నిల్చుంది. అలాంటి వ్యక్తిని అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. నాకైతే సమంత దగ్గరుండి ఆమెకి అమ్మలా ఉండి చూసుకోవాలని ఉంది. ఆమెకి అన్నివిధాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను అని తెలిపింది. దీంతో రష్మిక చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.