Puri Jagannadh : నాకు ప్రాణహాని ఉంది.. పోలీసులకి ఫిర్యాదు చేసిన పూరి జగన్నాధ్..

Kaburulu

Kaburulu Desk

October 27, 2022 | 07:23 AM

Puri Jagannadh : నాకు ప్రాణహాని ఉంది.. పోలీసులకి ఫిర్యాదు చేసిన పూరి జగన్నాధ్..

Puri Jagannadh :  గత రెండు రోజులుగా లైగర్ సినిమా ఇష్యూ టాలీవుడ్, బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. లైగర్ వల్ల తమకు భారీ నష్టాలూ వచ్చాయంటూ, వాటిని భర్తీ చేయాలని, లేకపోతే మీ ఇంటి ముందు ధర్నా చేస్తామని లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ పూరి జగన్నాధ్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాధ్ ఇలా బ్లాక్ మెయిల్ చేస్తే అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చాడు.

ఈ గొడవ ఇలా సాగుతుండగానే తాజాగా పూరి జగన్నాధ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో టాలీవుడ్ లో ఈ విషయం మరింత హీట్ ని పెంచింది. లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైన్షియర్ శోభన్ పై పూరి జగన్నాథ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Puri Jagannadh : పూరి జగన్నాధ్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్న లైగర్ డిస్ట్రిబ్యూటర్స్.. సీరియస్ అయిన పూరి..

వారిద్దరినుంచి నాకు, నా ఫ్యామిలీకి ప్రాణ హాని ఉందని, వేరే డిస్ట్రిబ్యూటర్స్ ని రెచ్చగొడుతున్నారని, మాకు రక్షణ కలిపించి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకి పూరి జగన్నాధ్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వార్త చర్చగా మారింది. లైగర్ ఫ్లాప్ మీద ఇంత రచ్చ నడుస్తున్నా విజయ్ దేవరకొండ మాట్లాడకపోవడం విశేషం.