Priyanka Chopra : మూడేళ్ళ తర్వాత ఇండియాకి వచ్చిన ప్రియాంక చోప్రా..

Kaburulu

Kaburulu Desk

November 1, 2022 | 08:19 AM

Priyanka Chopra : మూడేళ్ళ తర్వాత ఇండియాకి వచ్చిన ప్రియాంక చోప్రా..

Priyanka Chopra :  ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. హాలీవుడ్ సినిమాలతో అమెరికాకి వెళ్ళిపోయి తనకంటే చిన్నవాడైన సింగర్ నిక్‌ జోనస్‌ ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపొయింది. ఆ తర్వాత సరోగసి పద్దతిలో ఓ కూతురికి జన్మనిచ్చింది. అమెరికాలోనే ఉంటూ అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ప్రియాంక.

Samantha : అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత.. ఆ వ్యాధితో బాధపడుతున్నానంటూ పోస్ట్ చేసిన సామ్..

తాజాగా మూడేళ్ళ తర్వాత ప్రియాంక చోప్రా ఇండియాకి వచ్చింది. ప్రియాంకతో పాటు భర్త నిక్ జోనస్, కూతురు కూడా వచ్చారు. సోమవారం రాత్రి ప్రియాంక ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగింది. మూడేళ్ళ తర్వాత ప్రియాంక ఇండియా వస్తుందని తెలిసి అభిమానులు, సన్నిహితులు ఎయిర్ పోర్ట్ కి వెళ్లి మరీ స్వాగతం చెప్పారు. అయితే ఏ పని మీద ఇండియాకి వచ్చిందనే సమాచారం మాత్రం ఇవ్వలేదు ప్రియాంక.