Priya Bhavani Shankar : డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చాను..
ప్రస్తుతం ప్రియా భవాని చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. తాజాగా కళ్యాణం కమనీయంకి సంబంధించి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలని తెలియచేసింది. ప్రియా భవాని శంకర్ మాట్లాడుతూ...........
![Priya Bhavani Shankar : డబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చాను..](https://kaburulu.com/wp-content/uploads/2023/01/priya-bhavani-shankar.jpg)
Priya Bhavani Shankar : సినీ పరిశ్రమకి కొంతమంది ఇష్టంతో, సినిమా మీద ప్రేమతో వస్తారు. కొంతమంది మాత్రం సక్సెస్ అయితే ఇక్కడ బాగా డబ్బు వస్తుంది కాబట్టి డబ్బుల కోసమే వస్తారు. గతంలో కొంతమంది సినీ పరిశ్రమకి డబ్బు కోసమే వచ్చామని చెప్పారు. తాజాగా మరో తమిళ హీరోయిన్ కూడా అదే మాట చెప్తుంది. తమిళ్ లో మేయాదమానే అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియా భవానీశంకర్ మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించింది.
ఆ తర్వాత అనేక తమిళ సినిమాలలో నటించి పాపులర్ అయింది. ఇటీవల ధనుష్తో తిరుచ్చిట్రంఫలం సినిమాలో చిన్న పాత్ర పోషించి బాగా పాపులర్ అయింది. ఈ సినిమా తెలుగులో ‘తిరు’ గా రిలీజ్ అయి మంచి విజయం సాధించడంతో తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరైంది ఈ తమిళ భామ. తాజాగా ఈ సంక్రాంతికి తెలుగులో సంతోష్ శోభన్ సరసన కళ్యాణం కమనీయం అనే డైరెక్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
Rashmika Mandanna : ట్రోల్స్ పై మరోసారి స్పందించిన రష్మిక.. నా ఫ్యామిలీని అంటే ఊరుకోను..
ఈ అమ్మడికి ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ప్రస్తుతం ప్రియా భవాని చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. తాజాగా కళ్యాణం కమనీయంకి సంబంధించి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలని తెలియచేసింది. ప్రియా భవాని శంకర్ మాట్లాడుతూ.. నాకు సహజత్వానికి దగ్గరగా ఉండే కథలంటే ఇష్టం. నేను సినిమాల్లోకి వచ్చింది డబుల కోసమే. నటిస్తే డబ్బులు వస్తుంది అని భావించాను, అందుకే సినిమాల్లోకి వచ్చాను. ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారా లేదా అనే భయం నాకు లేదు. కాకపోతే సినిమా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కష్టపడుతున్నారు, నేను కూడా కష్టపడాలి కదా అందుకే నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అని తెలిపింది. దీంతో ప్రియా భవాని శంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చగా మారాయి.