Prabhas : బిల్లా రీ రిలీజ్.. అభిమానుల అత్యుత్సాహం.. థియేటర్లో కుర్చీలు తగలబెట్టిన వైనం..

Kaburulu

Kaburulu Desk

October 23, 2022 | 10:34 AM

Prabhas : బిల్లా రీ రిలీజ్.. అభిమానుల అత్యుత్సాహం.. థియేటర్లో కుర్చీలు తగలబెట్టిన వైనం..

Prabhas :  ఇటీవల స్టార్ హీరోల పుట్టిన రోజులకి వారి పాత సినిమాలని మళ్ళీ రీ రిలీజ్ చేస్తూ స్పెషల్ షోలు వేస్తున్న సంగతి తెలిసిందే. వీటికి అభిమానుల నుండి ఆదరణ బాగుండటంతో మిగిలిన హీరోలు కూడా ఈ పద్దతిని ఫాలో అవుతున్నారు. తాజాగా నేడు అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు ఉండటంతో బిల్లా సినిమాని రీ రిలీజ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్స్ లో స్పెషల్ షోలు వేశారు.

ఈ స్పెషల్ షోలకి అభిమానులు భారీగా తరలి వచ్చారు. అయితే కొంతమంది అభిమానులు అత్యుత్సాహం చూపించి థియేటర్స్ ని ధ్వంసం చేశారు. తణుకులో ఓ థియేటర్లో అభిమానులు అరుపులు, కేకలు వేస్తూ కుర్చీల మీద నిల్చొని ఎగిరారు. కొన్ని కుర్చీలని విరగ్గొట్టారు. థియేటర్లో రచ్చ రచ్చ చేశారు.

Bomma BlockBuster : బొమ్మ బ్లాక్‌బస్టర్.. మరోసారి రష్మీ రొమాన్స్.. హిట్ కొట్టేయడానికి రెడీ అయిపొయిందిగా..

తాడేపల్లి గూడెంలోని మరో థియేటర్లో ఏకంగా క్రాకర్స్ తీసుకొచ్చి కాల్చారు. దీంతో థియేటర్లోని కొన్ని కుర్చీలకి మంటలు అంటుకొని తగలబడ్డాయి. దీంతో థియేటర్లో పలు కుర్చీలు కాలి బూడిదయ్యాయి. ఇలాంటి కొన్ని సంఘటనలు మరిన్ని థియేటర్స్ లో కూడా జరిగాయి. ఈ సంఘటనలపై థియేటర్ యాజమాన్యాలు సీరియస్ అయ్యాయి. కొంతమంది పోలీసులకి కంప్లైంట్ ఇవ్వగా, మరి కొంతమంది అభిమానుల సంఘాలతో చర్చలు జరుపుతున్నారు.