Pawan Kalyan : ఒక రోజు ముందుగానే పవన్ అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్..

పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్ కోసం అభిమానులతో పాటు సినీ, రాజకీయ నాయకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 3న ఈ ఎపిసోడ్ ని రిలీజ్ చేస్తాము అని చెప్పిన మేకర్స్. ఇప్పుడు..

Kaburulu

Kaburulu Desk

February 1, 2023 | 08:41 AM

Pawan Kalyan : ఒక రోజు ముందుగానే పవన్ అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్..

Pawan Kalyan : ఆహాలో పరసారమవుతున్న అన్‌స్టాపబుల్‌ టాక్ షో రెండు తెలుగు రాష్ట్రాలని ఉర్రుతలూగిస్తుంది. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో భారీ పాపులారిటీ సంపాదించుకొని దేశంలోనే నెంబర్ వన్ టాక్ షో అనిపించుకుంది. ఇటీవల ఈ షోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని తీసుకు వచ్చి సంచలనం సృష్టించిన షో డైరెక్టర్స్.. ఇప్పుడు సినిమా అండ్ పాలిటిక్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా తీసుకువచ్చి సరికొత్త సంచలనాన్నికి తెరలేపారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకోవడంతో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు అందరూ.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ‘OG’ కథని దర్శకుడు మొదట మహేష్ బాబు వినిపించాడా?

ఇక ఈ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాము అని తెలియజేసిన మేకర్స్.. ఫస్ట్ పార్ట్ ని ఫిబ్రవరి 3న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ ఎపిసోడ్ ని ఒక రోజు ముందే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటలకు ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ప్రోమోని రిలీజ్ చేశారు షో నిర్వాహకులు. ఇక ఈ వార్త విన్న అభిమానులు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉండడంతో ఈ ఎపిసోడ్ పై రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకుంది. అలాగే పవన్ మూడు పెళ్లిళ్ల గురించి చాలా మంది విమర్శలు చేస్తుంటారు. ఆ విషయం గురించి కూడా బాలయ్య ప్రశ్నించగా, పవన్ పెళ్లిళ్ల వెనుక ఉన్న కారణం తెలియజేసినట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ లో సినిమా మరియు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు, సెకండ్ పార్ట్ లో రాజకీయ విషయాలు చర్చకు రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ షోలో పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొన్నాడు. రామ్ చరణ్ ఫోన్ కాల్ ద్వారా బాలయ్య, పవన్ తో మాట్లాడాడు.