Puri Jagannadh : పూరి జగన్నాధ్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్న లైగర్ డిస్ట్రిబ్యూటర్స్.. సీరియస్ అయిన పూరి..

Kaburulu

Kaburulu Desk

October 26, 2022 | 09:12 AM

Puri Jagannadh : పూరి జగన్నాధ్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్న లైగర్ డిస్ట్రిబ్యూటర్స్.. సీరియస్ అయిన పూరి..

Puri Jagannadh :  ఇటీవల విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమాని తెరకెక్కించారు. భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా రిలీజయిన లైగర్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాని పూరి జగన్నాధ్, కరణ్ జోహార్ కలిసి నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఎక్కువ ధర పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి భారీగా నష్టం చేకూరింది.

దీంతో లైగర్ సినిమాని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అంతా తమ నష్టాన్ని భర్తీ చేయాలనీ పూరి జగన్నాధ్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే పూరి డబ్బులు ఇస్తాను కానీ టైం పడుతుంది అని చెప్పాడంట. కానీ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ పూరి ఇంటి వద్ద ధర్నాకి దిగుతామని, డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోము అని పూరీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వాట్సాప్ గ్రూపుల్లో దీనికి సంబంధించిన మెసేజ్ లు బయటకి రావడంతో ఈ వార్త వైరల్ గా మారింది.

D Entertainment : ధోని నిర్మాతగా.. తమిళ్ లోనే ఫస్ట్ సినిమా.. హీరో, హీరోయిన్స్ ఎవరో తెలుసా?

అలాగే ఓ ఎగ్జిబిటర్ పూరికి కాల్ చేసి దీని గురించి మాట్లాడుతూ సీరియస్ అవ్వడంతో పూరి కూడా సీరియస్ అయ్యాడు. పూరి సీరియస్ గా మాట్లాడిన ఆడియో కాల్ బయటకి లీక్ అవడంతో ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఈ ఆడియో కాల్ లో పూరి.. ”ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికీ డబ్బు తిరిగి ఇవ్వనవసరం లేదు, అయినా ఇస్తాను అన్నాను మీరు నష్టపోయారు పాపం అనుకోని. కాకపోతే టైం పడుతుంది. ఒక నెల రోజుల్లో ఇస్తాను అన్నాను. ఇన్ని చెప్పాక కూడా మీరు ఇలాగే ధర్నాలు అంటూ బ్లాక్ మెయిల్ చేస్తే ఇస్తా అన్న మనీ కూడా ఇవ్వబుద్ది కాదు. నా పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను” అని సీరియస్ అయ్యారు. మరి ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.