Sharwanand : సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ సిద్దమవుతున్న శర్వానంద్?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లో ఒకడు శర్వానంద్. ఈ హీరో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు ఇటీవల గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా శర్వానంద్ పెళ్లి గురించి మరో షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. శర్వానంద్ సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకోడానికి రెడీ అవుతున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Kaburulu

Kaburulu Desk

January 25, 2023 | 06:02 PM

Sharwanand : సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ సిద్దమవుతున్న శర్వానంద్?

Sharwanand : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లో ఒకడు శర్వానంద్. ఇటీవల బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో పెళ్లి విషయం గురించి ప్రశ్నించగా ప్రభాస్ తరువాత చేసుకుంటా అని మాట దాటేశాడు. కట్ చేస్తే ఆ షో అయిన కొన్ని రోజులకే ఈ యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు గురించి ఇప్పటి వరకు శర్వానంద్ స్పందించ లేదు. తాజాగా శర్వానంద్ పెళ్లి గురించి మరో షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. శర్వానంద్ సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకోడానికి రెడీ అవుతున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Sharwanand : ఒక చెడ్డ సినిమా చేసి అది హిట్ అంటే.. ప్రేక్షకులని మోసం చేస్తున్నట్టే.. వాళ్ళకి అన్ని తెలుసు..

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన రక్షితా రెడ్డితో శర్వా ఏడడుగులు వేయబోతున్నాడు. ఒక కామన్ ఫ్రెండ్ వల్ల పరిచయమైన వీరిద్దరూ ఇప్పుడు వివాహం వరకు చేరుకున్నారు అని సమాచారం. రక్షితా రెడ్డి.. హైకోర్టు లాయర్ మధుసూధన్ రెడ్డి కుమార్తె మరియు రాజకీయ నాయకుడు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మనవరాలిగా తెలుస్తుంది. కాగా వీరిద్దరూ జనవరి 26న ఎంగేజ్‌మెంట్ రింగులు మార్చుకోనున్నారు అని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని పై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కానీ పెళ్లి వార్తలు మాత్రం గట్టిగా వినిపిస్తుండడంతో శర్వానంద్ సీక్రెట్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్నాడు అంటూ కొందరు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక శర్వానంద్ ప్రొఫెషనల్ కెరీర్ దగ్గరికి వస్తే.. చివరిగా ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టైం ట్రావెల్ కి మదర్ సెంటిమెంట్ ని జత చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో తన 33వ సినిమాని ‘చల్ మోహన్ రంగా’ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో చేస్తున్నాడు. పూజ కార్యక్రమాలతో ఘనంగా మొదలైన ఈ సినిమా.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాలో శర్వానంద్ కి జంటగా రాశి ఖన్నా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.